NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు
    తదుపరి వార్తా కథనం
    నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు
    నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం

    నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు

    వ్రాసిన వారు Stalin
    Mar 07, 2023
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్‌డీపీ చీఫ్ నీఫియు రియో, ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

    నాగాలాండ్ రాజకీయ ప్రముఖుడు, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నీఫియు రియో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఆయన బీజేపీ మద్దతుతో వరుసగా ఐదవసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టబోతున్నారు.

    60మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్‌డీపీ-బీజేపీ కూటమి 37సీట్లు సాధించడంతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.

    నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రను తిరగరాస్తూ.. తొలిసారి ఈ సారి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం గమనార్హం.

    మేఘాలయ

    రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్న సంగ్మా

    మేఘాలయలో ఎన్‌పీపీ చీఫ్ సంగ్మా నేతృత్వంలోని కూటమి 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

    మొత్తం 60స్థానాలుకు అసెంబ్లీ ఎన్నికలు జరగగ్గా ఎన్‌పీపీ 26 స్థానాలను గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. వరుసగా రెండోసారి ఆయన సీఎం పీఠాన్ని అధిష్ఠంచబోతున్నారు.

    యూడీపీ 11 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంది. గత అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకున్న తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ఐదు సీట్లు వచ్చాయి.

    బీజేపీ, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, హిల్‌ స్టేట్‌ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీలు చెరో రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి నాలుగు సీట్లు వచ్చాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగాలాండ్
    నీఫియు రియో
    కాన్రాడ్ సంగ్మా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నాగాలాండ్

    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని ప్రధాన మంత్రి
    నాగాలాండ్: 60ఏళ్ల అసెంబ్లీ చరిత్రలో మహిళకు దక్కని ప్రాతినిధ్యం; ఈసారైనా అబల గెలిచేనా? అసెంబ్లీ ఎన్నికలు

    నీఫియు రియో

    మార్చి 7న నాగాలాండ్ సీఎంగా ​​ 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం నాగాలాండ్

    కాన్రాడ్ సంగ్మా

    ఈనెల 7న మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం మేఘాలయ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025