NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Minister Lokesh: 'అనంత'లో రూ.22 వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్తు కాంప్లెక్స్‌.. రేపు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Minister Lokesh: 'అనంత'లో రూ.22 వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్తు కాంప్లెక్స్‌.. రేపు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన
    'అనంత'లో రూ.22 వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్తు కాంప్లెక్స్‌

    Minister Lokesh: 'అనంత'లో రూ.22 వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్తు కాంప్లెక్స్‌.. రేపు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అనంతపురం జిల్లాలోని గుత్తి మండలానికి చెందిన బేతపల్లిలో దేశంలోనే అత్యంత పెద్దదైన ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

    దాదాపు రూ.22 వేల కోట్ల భారీ పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును 'రెన్యూ విక్రమ్‌శక్తి ప్రైవేట్‌ లిమిటెడ్‌' అనే సంస్థ అభివృద్ధి చేయనుందని పేర్కొంది.

    ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని మే 17వ తేదీన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టనున్నారు.

    వివరాలు 

     'దావోస్‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరం' సదస్సులో మంత్రి లోకేశ్, రెన్యూ గ్రూప్ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య చర్చలు

    ఇంటిగ్రేటెడ్‌ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక రకాల ప్రోత్సాహకాలను పొందేందుకు పునరుత్పాదక విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో విస్తృతంగా పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయని అధికారులు తెలిపారు.

    ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన 'దావోస్‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరం' సదస్సులో మంత్రి లోకేశ్, రెన్యూ గ్రూప్ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య చర్చలు జరిగాయని, వాటి ఫలితంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.

    దాదాపు ఆరు సంవత్సరాల విరామం తరువాత రెన్యూ సంస్థ తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు.

    వివరాలు 

    415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ నిల్వ కేంద్రాల ఏర్పాటు

    ప్రాజెక్టు తొలి దశలో 587 మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల వాయు విద్యుత్,415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

    ఈ దశకే సుమారు రూ.7,000కోట్లు పెట్టుబడిగా ఖర్చు చేయనుంది. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్టును మరింత విస్తరించనున్నఈ సంస్థ, మొత్తంగా 1,800మెగావాట్ల సౌర విద్యుత్, 1,000మెగావాట్ల వాయు విద్యుత్, 2,000మెగావాట్ల బ్యాటరీ నిల్వ సామర్థ్యం కలిగిన యూనిట్లుగా అభివృద్ధి చేయనుందని తెలిపింది.

    ఇదిలా ఉండగా, 2019కి ముందుగా రెన్యూ సంస్థ రాష్ట్రంలో 777మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ,వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల(పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు)రద్దు చేయడంతో ఆప్రాజెక్టులు అమలుకావడం సాధ్యపడలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    వివరాలు 

    ఐదేళ్ల కాలంలో 72,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్

    ప్రస్తుతం బేతపల్లిలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు కోసం రైతుల నుండి తీసుకున్న భూములకు వార్షికంగా ప్రతి ఎకరాకు రూ.31,000 లీజ్‌ ఇవ్వనుండగా, ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి 5 శాతం లీజ్ పెంపు ఉంటుందని ఒప్పందం కుదిరినట్లు అధికారులు తెలిపారు.

    దావోస్ సదస్సులో జరిగిన చర్చల సమయంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహాలను మంత్రి లోకేశ్ రెన్యూ సంస్థకు వివరించారని తెలిపారు.

    రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఉద్దేశ్యం వచ్చే ఐదేళ్ల కాలంలో మొత్తం 72,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేయడం అని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అనంతపురం అర్బన్

    తాజా

    Minister Lokesh: 'అనంత'లో రూ.22 వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్తు కాంప్లెక్స్‌.. రేపు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన అనంతపురం అర్బన్
    Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని కట్‌రా-కాజీగుండ్‌ మధ్య రైలు.. విజయవంతంగా రౌండ్‌ ట్రిప్‌ పూర్తి.. సైనిక దళాల రాకపోకలకు మరింత ప్రయోజనకరం  జమ్ముకశ్మీర్
    Saraswathi Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం తెలంగాణ
    Miss world 2025: ఓరుగల్లులో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి.. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయాల సందర్శన వరంగల్ తూర్పు

    అనంతపురం అర్బన్

    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం ఆంధ్రప్రదేశ్
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం  కర్నూలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025