NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / HCU: కంచ గచ్చిబౌలి భూ వివాద పరిష్కారానికి మంత్రుల కమిటీ .. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    HCU: కంచ గచ్చిబౌలి భూ వివాద పరిష్కారానికి మంత్రుల కమిటీ .. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం 
    కంచ గచ్చిబౌలి భూ వివాద పరిష్కారానికి మంత్రుల కమిటీ .. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం

    HCU: కంచ గచ్చిబౌలి భూ వివాద పరిష్కారానికి మంత్రుల కమిటీ .. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 04, 2025
    08:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కంచ గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

    ఈ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు తదితర భాగస్వాములందరితో చర్చలు జరపనుంది.

    ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ప్రకటించారు.

    ఈ కమిటీలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.

    కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ప్రభుత్వం అప్పగించగా, అభివృద్ధి కార్యక్రమాలకు టీజీఐఐసీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో విద్యార్థులు నిరసనలు ప్రారంభించారు.

    దీనిపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది.

    వివరాలు 

    భూమి కేటాయింపు వివరాలు 

    1975లో హెచ్‌సీయూకు కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని కేటాయించినప్పటికీ, యాజమాన్య హక్కులను వర్సిటీకి బదిలీ చేయలేదు.

    రెవెన్యూ,అటవీ శాఖ రికార్డుల ప్రకారం, సర్వే నంబర్ 25లోని ఈ భూమి ఎప్పుడూ అటవీ భూమిగా గుర్తించబడలేదు.

    ఈ భూమి హెచ్‌సీయూకు చెందినదికాదని, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రభుత్వ భూమిగా గుర్తించి, టీజీఐఐసీ అభ్యర్థన మేరకు సంస్థకు కేటాయించామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఈ ప్రాజెక్టు ద్వారా భారీ పెట్టుబడులు ప్రవేశించి, సుమారు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

    వివరాలు 

    రాజకీయ, సామాజిక ప్రతిస్పందనలు 

    భారత రాష్ట్ర సమితి (భారాస), భారతీయ జనతా పార్టీ (భాజపా) సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

    కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. దీనిపై కేంద్ర అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాలని కోరింది.

    గురువారం సుప్రీంకోర్టు కూడా ఈ భూమిలో చెట్ల నరికివేత సహా అన్ని అభివృద్ధి పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

    ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాద పరిష్కార దిశగా దృష్టి సారించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు.

    ఈ కమిటీ శుక్రవారం నుంచే వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి

    తాజా

    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్

    రేవంత్ రెడ్డి

    Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన నరేంద్ర మోదీ
    Local Body Elections: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: రేవంత్‌రెడ్డి  భారతదేశం
    Revanth Reddy: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి  భారతదేశం
    Bhuvanagiri: భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయం ధ్వంసం.. కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన  బీఆర్ఎస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025