NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు ! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు ! 
    నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు !

    Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు ! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2025
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ రోజు పాలమూరు జిల్లా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతోంది.

    మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొంటున్న అందగత్తెల బృందం, మహబూబ్‌నగర్ జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలు, వైద్య సంస్థలను సందర్శించనున్నారు.

    ముఖ్యంగా పిల్లలమర్రి మహావృక్షం, ఎక్స్‌పీరియం ఎకో పార్క్ వంటి ప్రదేశాల్లో వారి పర్యటనతో అక్కడ సందడిగా మారనుంది.

    ఈ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో ఉన్న వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయనుంది.

    వివరాలు 

    పిల్లలమర్రి మహావృక్షానికి అంతర్జాతీయ గుర్తింపు 

    భారతదేశంలో మూడవ అతిపెద్ద వృక్షంగా గుర్తింపు పొందిన పిల్లలమర్రి మహావృక్షానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర ఉంది.

    ఈ చారిత్రాత్మక మర్రిచెట్టు దగ్గర మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఫొటోలు తీసుకుంటూ, ఈ చెట్టు గొప్పతనాన్ని ఆస్వాదించనున్నారు.

    స్థానిక చరిత్ర నిపుణులు ఈ చెట్టు చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించనున్నారు. ఈ పార్క్ సహజ ఆకర్షణలు, గ్రీన్‌వేలు, వినోద కార్యకలాపాలతో సందర్శకులను ఆకట్టుకుంటుంది.

    వివరాలు 

    ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో ప్రకృతి సౌందర్యం ఆస్వాదన 

    ఈ పర్యటనలో భాగంగా, ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను కూడా అందగత్తెలు సందర్శించనున్నారు.

    ఈ పార్క్ గ్రీన్‌వేలు, ప్రకృతితో కలసిన వాతావరణం, వినోద కార్యక్రమాలతో ప్రసిద్ధి చెందింది.

    కంటెస్టెంట్లు అక్కడి ప్రదేశాలను పరిశీలించడమే కాక, స్థానిక కళాకారులతో కలసి సంభాషించి, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను ఆస్వాదించనున్నారు.

    అంతేకాకుండా పార్క్‌లోని ఆకర్షణీయమైన ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతారు.

    వివరాలు 

    హస్తకళలకు ప్రోత్సాహం 

    పిల్లలమర్రి పర్యటనలో భాగంగా కంటెస్టెంట్లు స్థానిక హస్తకళ ప్రదర్శనలను కూడా వీక్షించనున్నారు.

    స్థానిక మహిళలు తయారుచేసిన చేనేత వస్త్రాలు, మట్టితో చేసిన కళాకృతులు, బొమ్మలు వీరిని ఆకట్టుకోనున్నాయి.

    ఈ కళాకృతులలో కొన్నింటిని కొందరు కంటెస్టెంట్లు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

    ఇది స్థానిక కళలకు ఉత్సాహాన్ని అందించడంతోపాటు, పర్యాటక అభివృద్ధికి సహకరించనుంది.

    వివరాలు 

    అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ రుచులు 

    కంటెస్టెంట్లకు తెలంగాణ సంప్రదాయ వంటకాలను రుచి చూపించనున్నారు.

    ముఖ్యంగా పొట్టేలు గోంగూర, సకినాలు వంటి ప్రత్యేక వంటకాలను వారు ఆస్వాదించనున్నారు.

    ఈ ప్రాంతీయ వంటలు వారికి తెలంగాణ సంస్కృతి పట్ల మరింత అనురక్తిని కలిగిస్తాయి.

    ఏఐజీ ఆస్పత్రిలో వైద్య సేవల పరిశీలన

    ఇదే రోజు ఉదయం, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రిని సందర్శించారు.

    అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక వైద్య సేవల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు.

    అక్కడి చిన్నపిల్లలతో మాట్లాడుతూ, వారికి బహుమతులు అందజేశారు.

    అలాగే వైద్యులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగం ఎలా అభివృద్ధి చెందుతోంది అనేది పరిశీలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు !  తెలంగాణ
    SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు   స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం కేంద్ర ప్రభుత్వం
    Anurag Kashyap: లాభాల కోసం కళను తాకట్టు పెట్టిన ఓటీటీ వేదికలు : అనురాగ్ కశ్యప్‌ ఓటిటి

    తెలంగాణ

    Revanth Reddy: మిస్ వరల్డ్‌ ఏర్పాట్లపై సీఎం సమీక్ష..అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా అదేశాలు రేవంత్ రెడ్డి
    TG High Court: భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి హైకోర్టు
    TG SSC Result: నేడే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం  భారతదేశం
    Telangana: 11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025