
Kejriwal: ప్రజా ధనం దుర్వినియోగం.. కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేజ్రీవాల్తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రౌస్ అవెన్యూ కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 18కు వాయిదా వేసింది.
ప్రజా నిధులను దుర్వినియోగం చేసి రాజధానిలో పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మార్చి 11న కోర్టు పోలీసులకు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
156(3) Cr.PC సెక్షన్ కింద దర్యాప్తుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
Details
భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారని ఆరోపణలు
దిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డెఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 2007లోని సెక్షన్ 3 ప్రకారం కేసులు నమోదు చేయాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేహా మిట్టల్ తన తీర్పులో పేర్కొన్నారు.
2019లో అప్పటి మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ (ఆప్), ద్వారక ఏ వార్డు మాజీ కౌన్సిలర్ నితికా శర్మ రాజధానిలో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై అప్పటినుంచి ఫిర్యాదులు రావడంతో, కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది.