NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: వక్ఫ్‌ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: వక్ఫ్‌ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు
    వక్ఫ్‌ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు

    PM Modi: వక్ఫ్‌ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 14, 2025
    02:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపడుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ తమ పాలనలో వక్ఫ్ చట్ట నియమాలను స్వార్థ ప్రయోజనాల కోసం మార్చిందని ఆరోపించారు.

    ఓటు బ్యాంకు రాజకీయాలు నెరవేర్చేందుకు పవిత్ర రాజ్యాంగాన్ని ఆయుధంలా ఉపయోగించిందని మండిపడ్డారు.

    ముస్లిముల పక్షాన మాట్లాడుతున్న కాంగ్రెస్‌ గతంలో వారి అభ్యున్నతికి ఏ చర్యలు తీసుకురాలేదని విమర్శించారు.

    అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం నాయకులకు పార్టీలో ఉన్నత హోదాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

    అంతేకాదు ముస్లిం అభ్యర్థులకు 50 శాతం టిక్కెట్లు కేటాయించడంలో ఎందుకు వెనకడుగు వేసిందని నిలదీశారు.

    హరియాణాలోని హిస్సార్ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ, ఈ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయి అవుతుందన్నారు.

    Details

    కాంగ్రస్ రాజ్యాంగ విలువలను తాకట్టు పెట్టింది

    రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను స్మరించుకుంటూ, ఆయన సిద్ధాంతాలే తమ ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు.

    కానీ కాంగ్రెస్ మాత్రం అదే రాజ్యాంగాన్ని అధికార సాధనంగా ఉపయోగించిందని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితిని ఉదాహరణగా పేర్కొంటూ, అప్పట్లో రాజ్యాంగ విలువలను పాక్షికంగా తాకట్టు పెట్టారని ఆరోపించారు.

    ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నప్పటికీ, వాటిని అనుసరించడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది.

    Details

    ఏప్రిల్ 16న విచారణ

    అయితే ముస్లిం సంఘాలు దీన్ని రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం 14వ, 25వ, 26వ రాజ్యాంగ ఆర్టికల్స్‌ను ఉల్లంఘించిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

    ఈ నేపథ్యంలో ముస్లిం సంఘాల ప్రతినిధులు, విపక్ష పార్టీల ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    మొత్తం 15 పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఈ కేసులపై ఏప్రిల్ 16న విచారణ జరపనుంది. ఇక పలు రాష్ట్రాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

    పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన నిరసనల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో 110 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో వక్ఫ్ సవరణ చట్టం చుట్టూ రాజకీయ వేడి మరింత పెరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బీజేపీ
    కాంగ్రెస్

    తాజా

    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల

    నరేంద్ర మోదీ

    Meloni: లిబరల్స్‌ కుట్రలు నడవవు.. ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటు వ్యాఖ్యలు ఇటలీ
    PM Modi: కుంభమేళాపై విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ కౌంటర్ భారతదేశం
    PM Modi: ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ భారతదేశం
    CM Revanth Reddy: ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ రేవంత్ రెడ్డి

    బీజేపీ

    AP Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి.. కొత్త జాబితా సిద్ధం! తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    BJP: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి రూ. 1,737 కోట్లకు పైగా ఖర్చు  ఎన్నికల సంఘం
    Awadhesh Prasad: 'రామ్, సీతా మీరు ఎక్కడ'?.. బోరున విలపించిన ఎంపీ అయోధ్య
    Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్..  సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు కర్ణాటక

    కాంగ్రెస్

    Congress:'మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి': సావర్కర్ కళాశాల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ భారతదేశం
    Revanth Reddy: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. 55,143 ఉద్యోగాలు భర్తీ  రేవంత్ రెడ్డి
    Congress-BJP: ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు.. నాంపల్లిలో కాంగ్రెస్‌-బీజేపీ కార్యకర్తల ఘర్షణ నాంపల్లి
    Indiramma Houses: నెలాఖరులోగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025