PM Modi: నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ.. రూ. 19,850 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు. దక్షిణాది ప్రాంతాల పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తమిళనాడులో మోదీ రూ. 19,850 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల నిర్మించిన టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 1100 కోట్లకు పైగా వ్యయంతో ఈ కొత్త టెర్మినల్ ను నిర్మించారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, కొత్త రెండు-స్థాయి అంతర్జాతీయ టెర్మినల్ ఏటా 44 లక్షల మంది ప్రయాణీకులకు రద్దీ సమయాల్లో సుమారు 3,500 మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది.
పర్యటనలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
భారతీదాసన్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవం,41.4 కి.మీ పొడవైన సేలం-మాగ్నసైట్ జంక్షన్-ఓమలూరు-మెట్టూరు డ్యామ్ సెక్షన్ రెట్టింపుతో సహా పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇదే కాకుండా ప్రధాని పర్యటనలో భాగంగా ఐదు రోడ్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తన పర్యటనకు ముందు, ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోని అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. మోదీ తన పర్యటన వివరాలను X లో పోస్ట్ చేశారు.