Page Loader
Amith Shah: నలభై ఏళ్ల కల నెరవేర్చిన మోదీ ప్రభుత్వం: అమిత్‌ షా
నలభై ఏళ్ల కల నెరవేర్చిన మోదీ ప్రభుత్వం: అమిత్‌ షా

Amith Shah: నలభై ఏళ్ల కల నెరవేర్చిన మోదీ ప్రభుత్వం: అమిత్‌ షా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

నలభై ఏళ్లపాటు పసుపు రైతులు కలగా ఎదురుచూసిన పసుపు బోర్డును స్థాపించి, ప్రధాని నరేంద్ర మోదీ ఆ కలను నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. శనివారం నిజామాబాద్‌లో పర్యటించిన ఆయన, వినాయక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమిత్‌ షా మాట్లాడుతూ నిజామాబాద్‌ పసుపు పంటకు రాజధాని లాంటి ప్రాధాన్యం ఉంది. పసుపు రైతుల కోసం కేంద్రం పని చేస్తోంది.

Details

అదృష్టంగా భావిస్తున్నా : అమిత్ షా

నన్ను చేతుల మీదుగా బోర్డు ప్రారంభించేందుకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ పసుపుబోర్డు కోసం భాజపా ఎంపీలు గట్టిగా పోరాడారు. చివరికి తెలంగాణకు మాత్రమే కాదు, బోర్డు ఛైర్మన్‌గా కూడా ఇక్కడి వ్యక్తినే నియమించామని పేర్కొన్నారు. పసుపు యొక్క ఔషధ గుణాలు గురించి ఆయన వివరించారు. పసుపు ఒక దివ్య ఔషధం. ఇది యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ క్యాన్సర్‌గా పని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నిజామాబాద్‌ పసుపు పంటకు మంచి ఆదరణ ఉంది. 2030 నాటికి మనం ఒక్క బిలియన్‌ డాలర్ల విలువైన పసుపును ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని అని తెలిపారు.

Details

ఈ బోర్డు ద్వారా 

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ జియో ట్యాగింగ్‌ ద్వారా పసుపు గుర్తింపు భారత్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ద్వారా రైతులకు మద్దతు ఇలాంటి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, కె.లక్ష్మణ్‌, పసుపు బోర్డు ఛైర్మన్‌ గంగారెడ్డి పాల్గొన్నారు.