NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: రేపు దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్ష కీలక సమావేశం 
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: రేపు దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్ష కీలక సమావేశం 
    రేపు దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్ష కీలక సమావేశం

    Pahalgam Terror Attack: రేపు దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్ష కీలక సమావేశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2025
    02:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.

    దేశ భద్రతకు సంబంధించి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) బుధవారం మరోసారి సమావేశంకానుంది.

    ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. దాడి జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి అత్యవసరంగా సమావేశమైందన్న విషయం తెలిసిందే.

    గత బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

    పహల్గాం ఘటనలో పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించడమే కాకుండా, వారికి మద్దతు ఇస్తున్న శక్తులను కూడా బాధ్యులుగా ప్రకటిస్తూ పాకిస్థాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది.

    వివరాలు 

     సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేత 

    అంతేకాక, సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా నివారించేవరకు ఆ దేశంపై కఠినమైన ధోరణి కొనసాగించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది.

    దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించే చర్యలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

    ఇదిలా ఉండగా, నిన్న ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

    పహల్గాంలో పరిస్థితులు, భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న చర్యల వివరాలను ప్రధానికి తెలియజేశారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    కేంద్ర ప్రభుత్వం

    NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు ఆంధ్రప్రదేశ్
    Railway: 2027 నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక భారతదేశం
    Gurpatwant Singh Pannu: ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూన్‌పై 104 కేసులు విచారణలో ఉన్నాయి: కేంద్రం గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025