NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే 
    తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే

    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 19, 2025
    04:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే.

    ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోనూ పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి.

    ఈ నేపథ్యంలో మే 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో తెలంగాణలోని మూడు రైల్వే స్టేషన్లను పునః ప్రారంభించనున్నారు.

    వివరాలు 

    దేశవ్యాప్తంగా 102 స్టేషన్ల పునః ప్రారంభం 

    భారతదేశం మొత్తంలో 102రైల్వేస్టేషన్లను ఒకేసారి పునః ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

    ఇందులో తెలంగాణకు చెందిన మూడు స్టేషన్లూ ఉన్నాయి. బేగంపేట,వరంగల్,కరీంనగర్ రైల్వే స్టేషన్లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

    ఈ మూడు స్టేషన్లు అత్యాధునిక సౌకర్యాలతో, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులతో తీర్చిదిద్దారు.

    బేగంపేట రైల్వే స్టేషన్ - 26.55 కోట్లతో ఆధునీకరణ

    బేగంపేట రైల్వే స్టేషన్‌ను 26.55 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశారు.

    ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి.కొత్తగా నిర్మించిన స్టేషన్ భవనం,12 మీటర్ల వెడల్పుగల ఫుట్ ఓవర్ బ్రిడ్జి,ప్లాట్‌ఫాం షెల్టర్లు,లిఫ్టులు,ఎస్కలేటర్లు,సరికొత్త వెయిటింగ్ హాల్,టాయిలెట్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

    ప్రయాణికుల అనుభూతిని మెరుగుపరచే విధంగా ప్రతి కోణంలోను సౌకర్యాలను సమకూర్చారు.

    వివరాలు 

    వరంగల్ స్టేషన్ - విమానాశ్రయ తరహాలో అభివృద్ధి 

    వరంగల్ రైల్వే స్టేషన్‌ను ఎయిర్‌పోర్ట్ తరహాలో ఆధునీకరించారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ. 25.41 కోట్లు వెచ్చించారు.

    ఈ ఆధునీకరణలో భాగంగా విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ర్యాంపులు నిర్మించారు.

    పచ్చదనం కోసం ల్యాండ్‌స్కేపింగ్ చేపట్టారు. ఆధునిక ఆహారశాలలు, వాణిజ్య సముదాయాలు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్మించారు.

    మొత్తం స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయి, అత్యాధునిక హంగులతో మెరిసిపోతుంది.

    వివరాలు 

    కరీంనగర్ రైల్వే స్టేషన్ - కార్పోరేట్ మాదిరిగా తీర్చిదిద్దిన మోడల్ 

    కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను రూ. 30 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికంగా తీర్చిదిద్దారు.

    2023 ఆగస్టులో ప్రారంభమైన ఈ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు స్టేషన్ పూర్తిగా సిద్దమైంది. స్టేషన్‌లో కార్పొరేట్ స్థాయిలో ఏసీ వెయిటింగ్ హాల్స్ నిర్మించారు.

    సీసీటీవీ కెమెరాలతో మొత్తం స్టేషన్‌ను నిఘాలో ఉంచారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. స్టేషన్‌ పరిసరాలను శుభ్రంగా,ఆకర్షణీయంగా ఉంచారు.‌

    ఇక్కడ ఏర్పాటు చేసిన మౌలిక వసతుల్లో 6 బుకింగ్ కౌంటర్లతో పాటు వికలాంగులకు ప్రత్యేక బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు.

    12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండు ఎస్కలేటర్లు, స్టేషన్ ముందు పార్క్, అర్థవంతమైన సైన్ బోర్డులు, వెయిటింగ్ హాల్లు ఏర్పాటు చేశారు.

    వివరాలు 

    మొత్తంగా అభివృద్ధి దిశగా రైల్వే స్టేషన్లు 

    ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించబడతాయి.

    రాష్ట్రంలో మిగిలిన 37 స్టేషన్ల అభివృద్ధి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో తెలంగాణ ముఖ్య పాత్ర పోషిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ

    తెలంగాణ

    Telangana SSC Results: పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి  భారతదేశం
    Bandi Sanjay: గ్రూప్‌-1 పై నివేదిక ఇవ్వండి.. టీజీపీఎస్సీకి బండి సంజయ్‌ లేఖ బండి సంజయ్
    Telangana: ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు భారతదేశం
    Sarathi Portal: సారధి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్... భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025