NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 44మంది ఎమ్మెల్యేలు సిద్ధం.. రాజ్ భవన్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన మ‌ణిపూర్ బీజేపీ నేత
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Manipur: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 44మంది ఎమ్మెల్యేలు సిద్ధం.. రాజ్ భవన్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన మ‌ణిపూర్ బీజేపీ నేత
    రాజ్ భవన్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన మ‌ణిపూర్ బీజేపీ నేత

    Manipur: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 44మంది ఎమ్మెల్యేలు సిద్ధం.. రాజ్ భవన్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన మ‌ణిపూర్ బీజేపీ నేత

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    03:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వర్గ పోరాటాలతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మణిపూర్‌లో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత తోక్చం రాధేశ్యామ్ సింగ్ వెల్లడించారు.

    ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను రాజ్‌భవన్‌లో కలిసి, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.

    బీజేపీకి చెందిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనతో కలిసి గవర్నర్‌ను కలిశారు.

    రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మొత్తం 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని రాధేశ్యామ్ స్పష్టం చేశారు.

    ఈ విషయాన్ని అధికారికంగా గవర్నర్‌కు సమర్పించినట్లు తెలిపారు.

    ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న విషయం తెలిసిందే.

    వివరాలు 

    వ్యక్తిగతంగా 44 మంది ఎమ్మెల్యేలను కలిసిన స్పీకర్ సత్యబ్రత

    కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న విషయంపై తుది నిర్ణయం బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని రాధేశ్యామ్ అన్నారు.

    అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రత వ్యక్తిగతంగా 44 మంది ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడినట్టు సమాచారం.

    కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఎవరి నుంచి విరోధం లేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.

    రెండు సంవత్సరాలు కరోనా వల్ల ప్రభావితమైపోయాయని, తర్వాతి రెండు సంవత్సరాలు వర్గీయ హింస వల్ల రాష్ట్రం అస్థిరతకు గురైందని వివరించారు.

    మైతేలు, కుకీల మధ్య ఘర్షణలు తీవ్రమవడంతో అప్పటి సీఎం అయిన బీజేపీకి చెందిన ఎన్. బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.

    వివరాలు 

    మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు

    రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను అదుపులోకి తేవడంలో విఫలమయ్యారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

    మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక ఎమ్మెల్యే మృతిచెందిన కారణంగా ప్రస్తుతం 59 మంది మాత్రమే ఉన్నారు.

    బీజేపీ కూటమిలో 32 మంది మైతే తెగకు చెందిన ఎమ్మెల్యేలు, ముగ్గురు మణిపురి ముస్లింలు, 9 మంది నాగ వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు.

    వీరి మొత్తం సంఖ్య 44. ఇక కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా మైతే తెగకు చెందినవారే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్

    తాజా

    Manipur: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 44మంది ఎమ్మెల్యేలు సిద్ధం.. రాజ్ భవన్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన మ‌ణిపూర్ బీజేపీ నేత మణిపూర్
    Annadata Sukhibhav Scheme: రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! చంద్రబాబు నాయుడు
    Ayodhya: రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం ఖరారు.. జూన్ 3 నుంచి 5 వరకు కార్యక్రమాలు ఇవే..  అయోధ్య
    Manchu Vishnu: ఎన్నికల కోడ్ కేసు.. సుప్రీంకోర్టును అశ్రయించిన మంచు విష్ణు  మంచు విష్ణు

    మణిపూర్

    Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి  తాజా వార్తలు
    Manipur: మణిపూర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన 200 మంది సాయుధులు ఆర్మీ
    Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. కాల్పుల్లో ఇద్దరు మృతి..!  భారతదేశం
    Manipur: పేలుడులో దెబ్బతిన్న మణిపూర్‌ను నాగాలాండ్‌ను కలిపే వంతెన  నాగాలాండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025