Mp's Suspension : ఎంపీల సస్పెన్షన్పై పాదయాత్ర.. ప్లకార్డులతో హోరెత్తిస్తోన్న ప్రతిపక్ష నేతలు
భారత పార్లమెంట్ నుంచి 143 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఇండియా కూటమి బ్లాక్కు చెందిన ప్రతిపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ నుంచి భారీ మార్చ్ చేపట్టారు. ఫలితంగా వీధుల్లోకి వచ్చి సేవ్ డెమాక్రసీ అంటూ నినాదాలు చేశారు. చట్టసభ సభ్యులను సామూహికంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ దిల్లీలోని పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. డిసెంబరు 13న అనూహ్యంగా తలెత్తిన భద్రతా ఉల్లంఘనపై చర్చ జరగాలన్న డిమాండ్ల మధ్య లోక్సభ నుంచి 97 మంది, రాజ్యసభ నుంచి 46 మంది సస్పెండ్ అయ్యారు. ఉభయ సభల్లో కార్యకలాపాలకు సదరు ఎంపీలు అంతరాయం కలిగించారని కారణంగానే సస్పెషన్ విధించినట్లు సభ వ్యవహారాల శాఖ పేర్కొంది.