వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం
వెర్సోవా-బాంద్రా సీ లింకును వీర్ సావర్కర్ సేతుగా, నిర్మాణంలో ఉన్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్కి అటల్ బిహారీ వాజ్పేయి స్మృతినవ శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది. గత నెల వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా వెర్సోవా-బాంద్రా సీ లింక్కు సావర్కర్ పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఆ నిర్ణయానికి అనుగూనంగా క్యాబినెట్ ఆమోదించింది. క్యాబినెట్ నిర్ణయాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు, మంత్రి సుధీర్ ముంగంటివార్ ప్రకటించారు. దేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తుల పేర్లను వంతెనలకు పెట్టడం వల్ల ఎటువంటి వివాదాలకు తావు లేదని అన్నారు. వీర్ సావర్కర్ బీజేపీ అతిపెద్ద ఐకాన్లలో ఒకరు. ఆయన అనేక వివాదాలకు కేంద్రంగా ఉన్నారు.