NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ManiShankar Iyer: గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు!
    తదుపరి వార్తా కథనం
    ManiShankar Iyer: గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు!
    గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు!

    ManiShankar Iyer: గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 15, 2024
    05:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    రాజకీయాల్లో తనకు ఎదుగుదలలో గాంధీ కుటుంబం ఎంత ముఖ్యమో, తన రాజకీయ పతనానికి కూడా వారు అంతే కారణమని ఆయన అన్నారు.

    కాంగ్రెస్‌లో చిన్న స్థాయి నేతలకు సరైన గుర్తింపు ఉండదని ఆయన చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించినప్పటికీ, తనను అగ్రనాయకత్వం సస్పెండ్ చేయడం బాధించిందని అయ్యర్ తెలిపారు.

    అగ్రనేత సోనియా గాంధీని కలుసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా, అవకాశం ఇవ్వలేదని ఆయన తెలిపారు.

    Details

    ప్రణబ్ ముఖర్జీ ఒంటి చేత్తో పార్టీని నడిపారు

    రాహుల్ గాంధీతో ఒకసారి, ప్రియాంక గాంధీతో రెండు సార్లు మాత్రమే మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు.

    ప్రియాంకది దయా హృదయమని, ఆమె అప్పుడప్పుడు ఫోన్‌ చేసి తన బాగోగులు తెలుసుకుంటారని ఆయన తెలిపారు. 2012లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తలెత్తిన సంక్షోభాలను ఆయన ప్రస్తావించారు.

    సోనియా గాంధీ అనారోగ్యం, మన్మోహన్ సింగ్‌కు బైపాస్ సర్జరీ వంటి సమస్యల వల్ల పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు.

    ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఒంటి చేత్తో పార్టీని నడిపారని, ఆయన అందించిన నాయకత్వం తమకెంతో సాయపడిందని అయ్యర్ గుర్తుచేశారు.

    Details

    కాంగ్రెస్ లో కృషి చేసిన వారికి సరైన గుర్తింపు లేదు

    ఇటీవల రాజ్యసభ మాజీ డిప్యూటీ ఛైర్‌పర్సన్ నజ్మా హెప్తుల్లా కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

    ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత సోనియా గాంధీకి ఫోన్‌ చేస్తే గంటల పాటు లైన్‌లో ఉంచారని ఆమె ఆరోపించారు.

    కాంగ్రెస్‌లో కృషి చేసిన వారికి సరైన గుర్తింపు లేదని, అందుకే అనేకమంది నేతలు కాంగ్రెస్‌ను విడిచి వెళ్లారని ఆమె తెలిపారు.

    మణిశంకర్ అయ్యర్ ఆరోపణలతో పాటు నజ్మా హెప్తుల్లా వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ ఆగడాలను వెలుగులోకి తెచ్చాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    ఇండియా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    కాంగ్రెస్

    Agniveer: అగ్నివీర్ అజయ్ కుటుంబానికి రూ.98.39 లక్షలు చెల్లించాం: సైన్యం  ఆర్మీ
    Ex-Karnataka minister: కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్రకు 6 రోజుల ED రిమాండ్.. కర్ణాటక
    RSS: 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గోవడంపై నిషేధం ఎత్తివేత.. మండిపడిన కాంగ్రెస్  ఆర్ఎస్ఎస్
    Parliament: 'బయట పేపరు లీకులు, లోపల వాటర్ లీకులు'.. నీటి లీకేజీ‌పై కాంగ్రెస్ విమర్శలు నరేంద్ర మోదీ

    ఇండియా

    Hyderabad: ఓయూ కీలక నిర్ణయం.. హిందీ మహావిద్యాలయ అనుమతుల రద్దు హైదరాబాద్
    AR Rahman : సోషల్ మీడియాకు లీగల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియా
    Parliament : రేపట్నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రధాన సమస్యలపై దృష్టి పార్లమెంట్
    AP Roads: ఏపీలో రోడ్ల నిర్వహణలో మార్పులు.. జాతీయ రహదారుల మాదిరిగా రాష్ట్ర రహదారులు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025