NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nagarjuna Sagar : సాగర్‌ వద్ద ఏపీ పోలీసుల పహారా.. కేసు నమోదు చేసిన టీఎస్ పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    Nagarjuna Sagar : సాగర్‌ వద్ద ఏపీ పోలీసుల పహారా.. కేసు నమోదు చేసిన టీఎస్ పోలీసులు
    కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

    Nagarjuna Sagar : సాగర్‌ వద్ద ఏపీ పోలీసుల పహారా.. కేసు నమోదు చేసిన టీఎస్ పోలీసులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 01, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీస్ పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

    ఇదే సమయంలో ఆంధ్ర సరిహద్దు వైపు పోలీసులు భారీగా మోహరించారు. ఈ మేరకు ఏపీకి చెందిన దాదాపు 1200 మంది పోలీసులు కాపు కాస్తున్నారు.

    దీంతో తెలంగాణ పోలీసులు సైతం ప్రాజెక్టు వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

    మరోవైపు కృష్ణా బోర్డు అధికారులు సాగర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్‌, నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం డ్యామ్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం సమీక్షించ నిర్వహించనున్నారు.

    ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు, ఘటన స్థలంలో పరిస్థితిని అంచనా వేయనున్నారు.

    DETAILS

    మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీ

    గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి సాగర్‌ వద్దే మకాం వేశారు.ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ తరలించింది.

    ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉంది. మరో 12అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే ప్రమాదముంది.

    మరోవైపు ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్‌ పోలీస్ స్టేషన్'లో కేసు నమోదైంది.

    అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్‌ సిబ్బంది,నీటి పారుదలశాఖ అధికారులు స్థానిక పీఎస్'లో ఫిర్యాదు చేశారు.

    ఈ క్రమంలోనే అర్ధరాత్రి సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ పోలీసులు, ఏపీ నీటి పారుదల శాఖ అధికారులపై నాగార్జునసాగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

    details

    తెలంగాణ, ఏపీలకు వివాదం ఎందుకు

    రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పడ్డాయి.శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలన్న నిర్ణయం అమలుకు నోచుకోలేదు.

    ఈ మేరకు శ్రీశైలంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ నిర్వహించుకుంటోంది. ఏపీ అధికారులను అక్కడికి రానివ్వట్లేదు.

    ఇదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఏపీ భూభాగంలో ఉన్నాయి.కుడి కాలువ నుంచి ఏపీకి నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు.గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలిచ్చినా నీళ్లు విడుదల చేయలేదు.

    ప్రస్తుతం నీటి సమస్యలు లేకపోయినా, నీటి విడుదలకు గత రెండు నెలల్లో ఇబ్బందులేవీ రాకున్నా ఏపీ అధికారులు దూకుడు ప్రదర్శించారు.

    ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పట్నుంచో ఏపీ సర్కార్ డిమాండు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    నాగార్జునసాగర్

    తాజా

    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌

    తెలంగాణ

    Divyavani: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్
    Pawan Kalyan: నేటి నుంచి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ వివరాలు ఇవీ..  పవన్ కళ్యాణ్
    Telangana Elections: తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీగా క్రిమినల్ కేసులు.. నేరచరిత్రలో ఏ పార్టీ టాప్?  అసెంబ్లీ ఎన్నికలు
    Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్  అక్బరుద్దీన్ ఒవైసీ

    నాగార్జునసాగర్

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు శ్రీశైలం
    మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. నాగార్జునసాగర్‌లో సందడి చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
    Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్ ఎన్నికల సంఘం
    Nagarjuna Sagar : తెలంగాణలో ఎన్నికల వేళ ఏపికి సాగర్ నుంచి నీటి విడుదల భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025