Page Loader
లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుని అనారోగ్యంతో చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణ
చంద్రబాబుని చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపణ

లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుని అనారోగ్యంతో చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 14, 2023
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు కుట్ర పన్నారన్నారు. దీనిపై తమ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. వ్య‌వ‌స్థ‌ల్ని చేతుల్లోకి తీసుకుని, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో భాగంగానే ఈ దారుణానికి ఒడిగడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ అధినేతను అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భ‌ద్ర‌త‌లేని జైల్లో చంద్రబాబు ఆరోగ్యాన్ని క్షీణించేలా చేసి ప్రాణ‌హాని కలిగిస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడూ ఏ తప్పు చేయ‌లేదని, అలాంటి నేత పట్ల 73 ఏళ్ల వయసులో వైసీపీ ప్రభుత్వం రాక్ష‌సంగా ప్రవర్తిస్తోందని లోకేశ్ మండిపడ్డారు.

details

చంద్ర‌బాబుకి ఏం జ‌రిగినా, జ‌గ‌న్, జైలు అధికారుల‌దే పూర్తి బాధ్య‌త‌ : లోకేశ్

రిమాండ్‌లో ఉన్న వ్యక్తిని, ముద్దాయిగా హెల్త్ బులెటిన్ లో పేర్కొనడంపై ఎంతో శ్రద్ధపెట్టారన్నారు. కానీ ఆయన ఆరోగ్యం, భ‌ద్ర‌త‌పై మాత్రం అంత శ్రద్ధ పెట్ట‌ట్లేదన్నారు. జైల్లో దోమలు ఎక్కువ ఉన్నాయని చెప్పినా పట్టించుకోవట్లేదని, స్నానానికి చన్నీళ్లు ఇస్తున్నారని మొరపెట్టుకున్నా లెక్క చేయలేదన్నారు. ఏసీ సదుపాయం లేకున్నా కనీసం ఫ్యాన్ సైతం సరిగ్గా తిరగట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాబును అనారోగ్యానికి గురిచేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బాలకృష్ణ అన్నారు. ఆయనకు నాణ్యమైన వైద్యం అందంచడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిలైందంటూ నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటూ నారా బ్రాహ్మణి అన్నారు.