NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cabinet Ministers : మోదీ కొత్త మంత్రివర్గంలో 71 మంది మంత్రులకు చోటు.. వారెవరంటే ?
    తదుపరి వార్తా కథనం
    Cabinet Ministers : మోదీ కొత్త మంత్రివర్గంలో 71 మంది మంత్రులకు చోటు.. వారెవరంటే ?
    Cabinet Ministers : మోదీ కొత్త మంత్రివర్గంలో 71 మంది మంత్రులకు చోటు.. వారెవరంటే ?

    Cabinet Ministers : మోదీ కొత్త మంత్రివర్గంలో 71 మంది మంత్రులకు చోటు.. వారెవరంటే ?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2024
    10:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

    జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో ప్రధానిగా ఆయన నిలిచారు.

    ప్రధాని నేతృత్వంలోని కొత్త క్యాబినెట్‌లో, ప్రధానితో పాటు, 30 మంది మంత్రులు, 5 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు, 36 మంది రాష్ట్ర మంత్రులు సహా మొత్తం 71 మంది ఎంపీలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

    ఏ నేతలకు మంత్రి పదవులు ఇచ్చారో తెలుసుకుందాం.

    గుజరాత్ 

    గుజరాత్ నుంచి ఎవరికి అవకాశం దక్కింది? 

    గుజరాత్ నుంచి అమిత్ షా, ఎస్ జైశంకర్, మన్సుఖ్ మాండవియా, సీఆర్ పాటిల్, జేపీ నడ్డా, నీము బెన్ బంభానియాలకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

    ఎస్ జైశంకర్, జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీలు. కేంద్ర మాజీ మంత్రి పర్షోత్తం రూపాలాకు చోటు దక్కలేదు.

    పాటిల్ ఇక్కడి నుంచి తొలిసారి మంత్రి అవుతున్నారు. ప్రస్తుతం ఆయన గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

    గోవా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక నాయకుడు శ్రీపాద్ నాయక్.

    మహారాష్ట్ర 

    మహారాష్ట్ర నుంచి ఎవరు మంత్రి అయ్యారు? 

    మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ప్రతాప్ రావ్ జాదవ్, రక్షా ఖడ్సే, రామ్ దాస్ అథవాలే, మురళీధర్ మోహోల్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి అజిత్ పవార్)కి ఇండిపెండెంట్ ఛార్జ్‌తో ఒక రాష్ట్ర మంత్రి పదవిని బిజెపి ఆఫర్ చేసింది.

    ప్రఫుల్ పటేల్ పేరును పార్టీ ఖరారు చేసింది, అయితే అతను ఇప్పటికే మంత్రిగా ఉన్నాడని, అందువల్ల స్వతంత్ర బాధ్యతతో కూడిన రాష్ట్ర మంత్రి పదవిని అంగీకరించలేనని ఆయన చెప్పారు.

    ఉత్తరప్రదేశ్ 

    ఉత్తరప్రదేశ్‌కు చెందిన 9 మంది ఎంపీలు మంత్రులు అయ్యారు 

    హర్దీప్ సింగ్ పూరీ, రాజ్‌నాథ్ సింగ్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, పంకజ్ చౌదరి, బీఎల్ వర్మ, అనుప్రియా పటేల్, కమలేష్ పాశ్వాన్, ఎస్పీ సింగ్ బఘేల్‌లు ఉత్తరప్రదేశ్‌ నుంచి మంత్రులుగా నియమితులయ్యారు.

    రెండో దఫా మోదీ ప్రభుత్వంలో ఉత్తరప్రదేశ్‌ నుంచి మొత్తం 14 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు.

    అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 7 మంది మంత్రులు ఓడిపోయారు. ఒడిశాకు చెందిన అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, జువల్ ఓరాన్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

    బిహార్ 

    బీహార్ నుంచి 8 మంది, కర్ణాటక నుంచి 5 మంది ఎంపీలకు మంత్రివర్గంలో చోటు దక్కింది 

    బిహార్ నుంచి చిరాగ్ పాశ్వాన్, గిరిరాజ్ సింగ్, జితన్ రామ్ మాంఝీ, రాంనాథ్ ఠాకూర్, లాలన్ సింగ్, నిత్యానంద్ రాయ్, రాజ్ భూషణ్, సతీష్ దూబే మంత్రులుగా ఎంపికయ్యారు.

    కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, శోభా కరంద్లాజే, హెచ్‌డి కుమారస్వామి, వి సోమన్నలకు చోటు దక్కింది.

    మధ్యప్రదేశ్‌ నుంచి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, జ్యోతిరాదిత్య సింధియా, సావిత్రి ఠాకూర్‌, వీరేంద్రకుమార్‌లు మంత్రులుగా నియమితులయ్యారు.

    జమ్మూకశ్మీర్‌కు చెందిన జితేంద్ర సింగ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కిరణ్‌ రిజిజులకు చోటు దక్కింది.

    రాజస్థాన్ 

    రాజస్థాన్,హర్యానా నుండి ఎవరికి స్థానం లభించింది? 

    రాజస్థాన్‌ నుంచి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, భూపేంద్ర యాదవ్‌, భగీరథ్‌ చౌదరి మంత్రులుగా నియమితులయ్యారు.

    హర్యానాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రావు ఇంద్రజిత్ సింగ్, కృష్ణ పాల్ గుర్జార్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

    కేరళలో తొలిసారి బీజేపీని విజయపథంలో నడిపించిన సురేశ్ గోపీకి మంత్రి పదవి దక్కడం విశేషం. తెలంగాణ నుంచి జి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

    ఇతర రాష్ట్రాలు 

    ఇతర రాష్ట్రాల నుంచి మంత్రులు ఎవరంటే..?

    తమిళనాడు నుండి ఎల్ మురుగన్, జార్ఖండ్ నుండి సంజయ్ సేథ్,అన్నపూర్ణా దేవి, ఛత్తీస్‌గఢ్ నుండి టోఖాన్ సాహు, పశ్చిమ బెంగాల్ నుండి శంతను ఠాకూర్,సుకాంత్ మజుందార్, పంజాబ్ నుండి రవ్‌నీత్ సింగ్ బిట్టు, అస్సాం నుండి సర్బానంద సోనోవాల్, పబిత్రా మార్గెహ్రితా, ఉత్తరాఖండ్ నుండి అజయ్ తమ్తా, హర్ష్ మల్లా ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి డాక్టర్‌ చంద్రశేఖర్‌ పెమ్మసాని, రామ్‌మోహన్‌ నాయుడు కింజరాపు, శ్రీనివాస్‌ వర్మలకు మంత్రి పదవులు దక్కాయి.

    16 మంది మాజీ మంత్రులకు ఈసారి అవకాశం దక్కలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    Narendra Modi: ఏపీలో మే 3,4 తేదీల్లో నరేంద్ర మోదీ పర్యటన  ఆంధ్రప్రదేశ్
    Lok Sabha Elections 2024-PM Modi: రెండో దశ ఎన్నికల తర్వాత ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉంది: ప్రధాని మోదీ మహారాష్ట్ర
    Narendra Modi: 'సోషల్ మీడియాలో నా వాయిస్‌తో అసభ్యకరమైన విషయాలు'.. ఫేక్ వీడియోపై ప్రధాని మోదీ  భారతదేశం
    PM Modi: నేడు తెలంగాణాకి ప్రధాని.. జహీరాబాద్,మెదక్‌లలో ప్రసంగించనున్న మోదీ  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025