NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narendra Modi: 'సోషల్ మీడియాలో నా వాయిస్‌తో అసభ్యకరమైన విషయాలు'.. ఫేక్ వీడియోపై ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Narendra Modi: 'సోషల్ మీడియాలో నా వాయిస్‌తో అసభ్యకరమైన విషయాలు'.. ఫేక్ వీడియోపై ప్రధాని మోదీ 
    'సోషల్ మీడియాలో నా వాయిస్‌తో అసభ్యకరమైన విషయాలు'.. ఫేక్ వీడియోపై ప్రధాని మోదీ

    Narendra Modi: 'సోషల్ మీడియాలో నా వాయిస్‌తో అసభ్యకరమైన విషయాలు'.. ఫేక్ వీడియోపై ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2024
    02:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

    సోమవారం కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.

    ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలను సంధించారు. అదే సమయంలో 2024 ఎన్నికలు భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు.

    అభివృద్ధి చెందిన భారతదేశాన్ని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంతోపాటు దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ఈ ఎన్నికల లక్ష్యం అన్నారు.

    ఇవన్నీ జరగడానికి మీ ఓటు మాత్రమే దోహదపడుతుందన్నారు. భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడమే తమ సంకల్పం అని ..మోడీ విజన్ స్పష్టంగా ఉందని అన్నారు.

    Details

    అవినీతికి సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద..

    కర్ణాటకను కూడా కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చుకుందని ప్రధాని మోదీ అన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ వ్యక్తులు కర్ణాటక ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.

    దేశాన్ని దోచుకోవడమే కాంగ్రెస్ పని, దానికి బాధ్యత ఇస్తారా? అందరి అవినీతికి సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా దోపిడీ పాలన నడుస్తోందన్నారు.

    మీ ఓటు బలం మోడీకి బలం చేకూరుస్తుందని అన్నారు. కాలక్షేపం చేసే వారు భారతదేశాన్ని అభివృద్ధి చేయలేరు. దేశం కోసం పనిచేయాలంటే విజన్ కావాలి. ఏమీ లేనప్పుడు ఫలితం శూన్యం, కానీ మా విషయంలో, విజన్, నినాదం రెండూ స్పష్టంగా ఉన్నాయన్నారు.

    Details 

    బాలాకోట్ వైమానిక దాడులను ప్రస్తావించిన ప్రధాని మోదీ 

    2047 కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని మోదీ అన్నారు.

    సోషల్ మీడియాలో నా వాయిస్‌తో అసభ్యకరమైన విషయాలు పోస్ట్ చేస్తున్నారు.

    నా డీప్‌ఫేక్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

    షెడ్యూల్డ్ కులాలు,తెగల హక్కులను కాంగ్రెస్‌ హరిస్తోందన్నారు.బుజ్జగింపు కోసం కాంగ్రెస్ ఎంతవరకైనా వెళుతుందన్నారు.

    ఒకవైపు బీజేపీ ప్రభుత్వం తల్వారా వర్గానికి ఎస్టీ హోదా కల్పించింది. మరోవైపు కర్ణాటకలో రాజ్యాంగాన్ని మార్చాలని,ఎస్టీల హక్కులను కాలరాయాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించింది.

    ఇదొక్కటే కాదు, ప్రధాని మోడీ తన ర్యాలీలో బాలాకోట్ వైమానిక దాడులను కూడా ప్రస్తావించారు.

    బాలాకోట్‌లో వైమానిక దాడి తర్వాత తాను మొదట పాకిస్థాన్‌కు ఫోన్ చేసి తర్వాత ప్రపంచానికి తెలియజేశానని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Infosys: ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట.. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసుపై డీజీజీఐ క్లిన్‌చిట్! ఇన్ఫోసిస్
    AA22xA6 movie: అల్లు అర్జున్ సినిమాలో దీపిక పదుకోనే.. అట్లీ స్ట్రాటజీ అదిరింది! అల్లు అర్జున్
    Delhi: ప్రయాణికులకు అలర్ట్‌.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు దిల్లీ
    inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి! ఇంటర్

    నరేంద్ర మోదీ

    National Creators Award: మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డులు అందజేసిన ప్రధాని  భారతదేశం
    PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ  అస్సాం/అసోం
    Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్  మాల్దీవులు
    Arunachal Pradesh: ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025