Page Loader
National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీ,రాహుల్‌ గాంధీలకు దిల్లీ కోర్టు నోటీసులు 
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీ,రాహుల్‌ కు దిల్లీ కోర్టు నోటీసులు

National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీ,రాహుల్‌ గాంధీలకు దిల్లీ కోర్టు నోటీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రముఖులు సోనియా గాంధీ,రాహుల్‌ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌పై న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో,ప్రతివాదులకు తమ వాదనలు వినిపించే అవకాశం ఉండాలని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ విశాల్‌ గోగ్నే తెలిపారు. తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమలులోకి వచ్చిన కొత్త చట్ట నిబంధనల ప్రకారం, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జ్‌షీట్‌ను స్వీకరించలేమని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అభిప్రాయపడింది. దీంతో నిందితులను కోర్టుకు పిలిపించేలా నోటీసులు జారీ చేయాలంటూ ఈడీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.

వివరాలు 

ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని నోటీసులు జారీ 

అయితే గత వారం కోర్టు ఈడీ సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో అవసరమైన ఆధారాలు లేకపోవడంతో, సోనియా, రాహుల్‌ గాంధీలకు నోటీసులు జారీ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. తాజా విచారణలో మాత్రం కోర్టు ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు మరికొంతమంది పేర్లు ఉన్నాయి. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను విదేశీ నిధులతో నడిపారన్న ఆరోపణల ఆధారంగా ఈడీతో పాటు సీబీఐ కూడా దర్యాప్తు చేసింది. అయితే సీబీఐ దర్యాప్తు కొంతమేరకు ఆగిపోయినా, ఈడీ మాత్రం తన దర్యాప్తును కొనసాగిస్తోంది.

వివరాలు 

ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్‌ కంప్లెయింట్‌ దాఖలు

2023 నవంబరులో ఈ కేసులో భాగంగా ఈడీ, అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడంపై చర్యలు ప్రారంభించింది. ఈ ఆస్తులు ఉన్న ప్రాంతాలైన ఢిల్లీ, ముంబయి, లఖ్నవూ వంటి నగరాల్లో భవనాలకు నోటీసులు అంటించినట్లు వెల్లడించింది. అంతేకాక, కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు శామ్‌ పిట్రోడా, సుమన్‌ దుబేల పేర్లతో ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్‌ కంప్లెయింట్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై కోర్టు విచారణ జరుపుతోంది.