NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి
    ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి

    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 04, 2025
    09:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈశాన్య భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, మేఘాలయ, సిక్కిం, మణిపూర్‌ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితి విషమంగా మారింది.

    బ్రహ్మపుత్ర, బరాక్‌ నదులతో పాటు 15కు పైగా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వరదలతో దాదాపు 7 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.

    పలు గ్రామాలు నీటమునిగాయి. వర్షాలకు ఇండ్లు ధ్వంసమవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ప్రజలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అసోంలోని 21 జిల్లాల్లో 6.32 లక్షలకుపైగా ప్రజలు ప్రభావితమయ్యారు.

    వాతావరణ కేంద్రం 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. రోడ్డు, రైలు, నౌకాశ్రయాలపై కూడా వరదల ప్రభావం తీవ్రంగా ఉంది.

    Details

    సిక్కింలో తరుచూ విరిగిపడుతున్న కొండచరియలు

    నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిక్కింలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు తరచుగా సంభవిస్తున్నాయి.

    లాచెన్ నగరంలోని ఛతెన్ వద్ద ఆర్మీ క్యాంప్‌పై కొండచరియలు పడగా.. ఆరుగురు సైనికులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

    సిక్కింలో చిక్కుకున్న 1,700 మందిని ఇప్పటి వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 34 మందిని రెండు Mi-17 V5 హెలికాప్టర్ల సాయంతో పాక్యోంగ్‌ విమానాశ్రయానికి తరలించారు.

    ఎన్డీఆర్ఎఫ్‌కి చెందిన 23 మంది సభ్యులతో కూడిన బృందం అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. అదే సమయంలో తీస్తా నదిలో వాహనంతో కొట్టుకుపోయిన 8 మందిని గాలిస్తున్నారు.

    మేఘాలయలో పరిస్థితి మరింత విషమంగా ఉంది.

    Details

    సిక్కింలో ఐదుగురు మృతి

    తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లాలో పర్యాటకుడు రాజా రఘువంశీ (29) మృతి చెందగా, అతని భార్య సోనమ్‌ ఆచూకీ కనిపించలేదు.

    ఆమె కోసం 17 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్‌ బృందం గాలిస్తున్నారు. గత 10 రోజుల్లో సిక్కింలో మొత్తం 552 కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి.

    ఇందులో ఐదుగురు మృతిచెందారు. 152 ఇండ్లకు నష్టం వాటిల్లింది. అసోంలో బాధితుల కోసం 165 సహాయ శిబిరాలు, 157 సహాయ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

    ఇందులో 31,212 మంది ఆశ్రయం పొందుతున్నారు. మణిపూర్‌లో వరదల ప్రభావంతో 1.64 లక్షల మంది ప్రజలు దెబ్బతిన్నారు. 35,143 ఇండ్లకు నష్టం జరిగింది.

    Details

    వరద పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష

    వరదల పరిస్థితులపై అసోం, సిక్కిం ముఖ్యమంత్రులు, మణిపూర్‌ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు.

    అవసరమైనంత వరకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

    ప్రస్తుతం వరదల కారణంగా అసోంలో 17 మంది, అరుణాచల్ ప్రదేశ్‌లో 11 మంది, మేఘాలయలో 6 మంది, మిజోరాంలో 5 మంది, సిక్కింలో 3 మంది, త్రిపురాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

    అదనంగా, బిహార్‌లోని సివాల్‌ జిల్లాలో భారీ వర్షానికి ఏడుగురు మృతిచెందారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరదలు
    మేఘాలయ
    సిక్కిం

    తాజా

    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం
    IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా? ఐపీఎల్

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ

    మేఘాలయ

    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? అసెంబ్లీ ఎన్నికలు

    సిక్కిం

    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
    సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది భారతదేశం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025