NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nepali Student: ఒడిశాలోని కీట్‌ వర్సిటీలో 18 ఏళ్ల నేపాలీ బాలిక మృతి.. 90 రోజుల్లో రెండో కేసు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Nepali Student: ఒడిశాలోని కీట్‌ వర్సిటీలో 18 ఏళ్ల నేపాలీ బాలిక మృతి.. 90 రోజుల్లో రెండో కేసు 
    ఒడిశాలోని కీట్‌ వర్సిటీలో 18 ఏళ్ల నేపాలీ బాలిక మృతి.. 90 రోజుల్లో రెండో కేసు

    Nepali Student: ఒడిశాలోని కీట్‌ వర్సిటీలో 18 ఏళ్ల నేపాలీ బాలిక మృతి.. 90 రోజుల్లో రెండో కేసు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    12:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కీట్) లో నేపాలీ విద్యార్థుల ఆత్మహత్యలు ఒకటి తర్వాత ఒకటి చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

    రెండు నెలల క్రితం ఒక నేపాల్‌కు చెందిన విద్యార్థిని ఈ వర్సిటీ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరవకముందే, తాజాగా మళ్లీ మరో ఘటన సంభవించింది.

    కీట్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌ ఫస్ట్ ఇయర్‌ చదువుతోన్న 21 ఏళ్ల ప్రిషా షా అనే విద్యార్థిని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.

    ఈమె నేపాల్ రాజధాని కఠ్మాండూ నగరానికి సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్‌గంజ్‌కు చెందినవారు. ప్రిషా, విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నాల్గో నెంబర్ హాస్టల్‌లో నివాసముండేది.

    వివరాలు 

     హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. 

    గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆమె హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

    ఈ విషయాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

    దాంతో భువనేశ్వర్‌లోని ఇన్‌ఫోసిటీ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు డీసీపీ జగ్‌మెహన్ మీనా వర్సిటీకి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.

    అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని అధికారులు తెలియజేశారు.

    వివరాలు 

     అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

    పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆమె మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.

    ప్రస్తుతానికి ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా పరిగణించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

    ఇదిలా ఉండగా, గత 90 రోజుల వ్యవధిలో కీట్‌ వర్సిటీలో నేపాలీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది రెండోది.

    గతంలో, ఈ ఏడాది ఫిబ్రవరి 16న బీటెక్ మూడో సంవత్సరం చదువుతోన్న నేపాలీ విద్యార్థిని ప్రకృతి లమ్సాల్ కూడా ఇదే విధంగా తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా

    తాజా

    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప

    ఒడిశా

    దేశంలోనే పాపులర్ సీఎంల జాబితాలో రెండోస్థానంలో 'యోగి'.. నంబర్ వన్ ఎవరో తెలుసా?  నవీన్ పట్నాయక్
    Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు ఆంధ్రప్రదేశ్
    Odisha: ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీ: మన్మోహన్‌ సమాల్‌ భారతదేశం
    Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025