NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nadendla Manohar: రాష్ట్రానికి నూతన గుర్తింపు.. ఈ-కేవైసీ నమోదులో ఏపీ దేశంలోనే అగ్రస్థానం
    తదుపరి వార్తా కథనం
    Nadendla Manohar: రాష్ట్రానికి నూతన గుర్తింపు.. ఈ-కేవైసీ నమోదులో ఏపీ దేశంలోనే అగ్రస్థానం
    రాష్ట్రానికి నూతన గుర్తింపు.. ఈ-కేవైసీ నమోదులో ఏపీ దేశంలోనే అగ్రస్థానం

    Nadendla Manohar: రాష్ట్రానికి నూతన గుర్తింపు.. ఈ-కేవైసీ నమోదులో ఏపీ దేశంలోనే అగ్రస్థానం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    11:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రేషన్ కార్డు వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ మరో కీలక ముందడుగు వేసింది. ఈ-కేవైసీ నమోదు ప్రక్రియలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

    తెనాలిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం ఈ-కేవైసీ పూర్తి అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 బియ్యం కార్డులు ఉండగా, వాటికి సంబంధించిన సభ్యుల సంఖ్య 4,24,59,028 అని చెప్పారు.

    ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డులకు సంబంధించిన మార్పులు, చేర్పులు, కొత్త దరఖాస్తులు వంటి ఆరు రకాల సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

    ఇకపై ఇంటి నుంచే ఈ సేవలు పొందేలా వాట్సాప్ గవర్నెన్స్‌ సౌకర్యాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు.

    Details

    జూన్ నుంచి ఆధునిక స్మార్ట్ కార్డుల జారీ

    95523 00009 అనే నంబర్‌కు 'హలో' అని మెసేజ్ చేయడం ద్వారా ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వివరించారు.

    ఇక రేషన్ కార్డుల స్థానంలో జూన్ నుంచి ఆధునిక స్మార్ట్ కార్డుల జారీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందులో భాగంగా తొలిసారిగా ఒంటరిగా నివసించే వారికి కూడా కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

    కళాకారులకు అందుతున్న పింఛన్లకు తోడు, గిరిజన బృందాలకు ప్రత్యేకంగా అంత్యోదయ కార్డుల ద్వారా నెలకు 35 కిలోల బియ్యం అందించనున్నట్లు వెల్లడించారు.

    లింగ మార్పు చేయించుకున్న వారికీ ఈ సౌకర్యం వర్తించనుందని మంత్రి స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాదెండ్ల మనోహర్‌

    తాజా

    Nadendla Manohar: రాష్ట్రానికి నూతన గుర్తింపు.. ఈ-కేవైసీ నమోదులో ఏపీ దేశంలోనే అగ్రస్థానం నాదెండ్ల మనోహర్‌
    Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ తెలంగాణ
    Taraka Rama Rao: నందమూరి వారసుడిగా తారక రామారావు అరంగేట్రం.. ఘనంగా ప్రారంభమైన తొలి సినిమా టాలీవుడ్
    Khyber Pakhtunkhwa: పాక్‌లో మరో ఆత్మాహుతి దాడి.. పోలీసు వాహనంపై ఆత్మాహుతి దాడి పాకిస్థాన్

    నాదెండ్ల మనోహర్‌

    Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు .. బాధ్యులపై పీడీ యాక్టు ప్రయోగం భారతదేశం
    Nadendla Manohar: దుష్ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వొద్దు.. పార్టీ నాయకులకు నాదెండ్ల సూచన పవన్ కళ్యాణ్
    Nadendla Manohar: రైతు సేవా కేంద్రాలు, రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు: నాదెండ్ల మనోహర్‌  భారతదేశం
    nadendla manohar: రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం: పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025