NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MA Baby: వామపక్ష పార్టీకి నూతన సారధి.. సీపీఎం చీఫ్‌గా ఎం.ఎ.బేబీ ఎంపిక
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    MA Baby: వామపక్ష పార్టీకి నూతన సారధి.. సీపీఎం చీఫ్‌గా ఎం.ఎ.బేబీ ఎంపిక
    వామపక్ష పార్టీకి నూతన సారధి.. సీపీఎం చీఫ్‌గా ఎం.ఎ.బేబీ ఎంపిక

    MA Baby: వామపక్ష పార్టీకి నూతన సారధి.. సీపీఎం చీఫ్‌గా ఎం.ఎ.బేబీ ఎంపిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 06, 2025
    04:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వామపక్ష రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ.బేబీ (M.A. Baby)ని ఎంపిక చేశారు.

    తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది సీతారాం ఏచూరి మరణంతో ఖాళీగా ఉన్న ప్రధాన కార్యదర్శి పదవిని ఆయన భర్తించనున్నారు.

    ఈ పదవికి తాత్కాలికంగా ప్రకాశ్ కారాట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ఈ మహాసభలో పార్టీకి కొత్త సారథి లభించాడు.

    Details

    85 మంది సభ్యులతో కేంద్ర కమిటీ 

    మదురై మహాసభలో 85 మందితో కూడిన కొత్త కేంద్ర కమిటీని పార్టీ ఎన్నుకుంది. అలాగే 18 మంది సభ్యులతో కొత్త పొలిట్‌బ్యూరోను కూడా ప్రకటించింది.

    ముఖ్యమైన అంశం ఏమిటంటే కేంద్ర కమిటీలో మహిళల శాతం 20శాతం మాత్రమే ఉండడం గమనార్హం. ప్రధాన కార్యదర్శి పదవికి అనేక ప్రముఖ నేతల పేర్లు పరిగణనలోకి వచ్చాయి.

    వీరిలో ఎం.ఎ.బేబీతో పాటు అశోక్ ధవలే, మహమ్మద్ సలీం, బి.వి.రాఘవులు, బృందా కారాట్ పేర్లు ముందుగా వినిపించాయి.

    అయితే అశోక్ ధవలేకు ఆలిండియా కిసాన్ సభ (AIKS) వర్గం నుంచి మద్దతు లభించినట్టు సమాచారం.

    Details

     ఎం.ఎ.బేబీ రాజకీయ ప్రస్థానం ఇదే

    1954లో కేరళలోని ప్రాక్కుళం ప్రాంతంలో పి.ఎం. అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ దంపతులకు ఎం.ఎ.బేబీ జన్మించారు.

    విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ప్రస్తుతం ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరి తన సాహసయాత్ర ప్రారంభించారు.

    1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. అనంతరం కేరళలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

    ఇప్పుడు తాజాగా పార్టీ శ్రేణులు ఆయనకు ప్రధాన బాధ్యతలు అప్పగించడంతో, ఎం.ఎ.బేబీకి దేశవ్యాప్తంగా వామపక్ష శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    ఇండియా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    కేరళ

    Nipah: కేరళలో నిపాతో వ్యక్తి మృతి.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 151 మందితో కాంటాక్ట్ లిస్ట్ నిఫా వైరస్
    Pager Blasts: లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు! లెబనాన్
    Kerala: బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్‌ఫెక్షన్‌తో కేరళ వ్యక్తి మృతి  భారతదేశం
    Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదు మంకీపాక్స్‌

    ఇండియా

    PM Modi: మహిళా సాధికారతే నా అసలైన సంపద: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలు-కుకీల ఘర్షణ.. రోడ్ల మూసివేతపై ఉద్రిక్తత మణిపూర్
    Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స ఉప రాష్ట్రపతి
    TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి! తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025