NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pm Modi:కొత్త నేర నియంత్రణ చట్టాలు.. పౌరుల హక్కుల రక్షణగా మారుతున్నాయి: మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Pm Modi:కొత్త నేర నియంత్రణ చట్టాలు.. పౌరుల హక్కుల రక్షణగా మారుతున్నాయి: మోదీ 
    కొత్త నేర నియంత్రణ చట్టాలు.. పౌరుల హక్కుల రక్షణగా మారుతున్నాయి: మోదీ

    Pm Modi:కొత్త నేర నియంత్రణ చట్టాలు.. పౌరుల హక్కుల రక్షణగా మారుతున్నాయి: మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 04, 2024
    08:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజ్యాంగం చూపించిన కలలను సాధించేందుకు కొత్త నేర నియంత్రణ చట్టాలు కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు.

    ఈ చట్టాలు పౌరహక్కులను రక్షిస్తూ, సత్వర న్యాయం అందించేందుకు మద్దతుగా ఉంటాయని అన్నారు.

    భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టం పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాలను జులై 1 నుంచి అమలులోకి తీసుకువచ్చింది.

    బ్రిటిషు కాలం నాటి ఐపీసీ చట్టాలను స్థానంలోకి ఈ కొత్త చట్టాలు వచ్చాయి.

    వివరాలు 

     వలస పాలనల ప్రభావం నుంచి బయటపడిన దేశం 

    చండీగఢ్‌ ఈ కొత్త చట్టాలను పూర్తిగా అమలు చేసిన మొదటి పాలనా విభాగంగా నిలిచింది.

    ఈ సందర్భంగా చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, "ఆంగ్లేయుల వెళ్లిపోవడంతో, వారు అమలు చేసిన దాస్యభావ చట్టాల నుంచి విముక్తి లభిస్తుందని అందరూ ఆశించారు, కానీ ఇది ఇప్పటికి సాధ్యమైంది" అని అన్నారు.

    దేశం ఇప్పుడు పూర్తిగా వలస పాలనల ప్రభావం నుంచి బయటపడిందని ప్రధాని చెప్పారు.

    చండీగఢ్ నగరం సత్యం, న్యాయానికి సంకేతంగా ఉండే చండీ అమ్మవారి పేరుతో అనుసంధానమైందని, కొత్త న్యాయసంహిత చట్టాల ఉద్దేశం కూడా ఇదేనని ప్రధాని పేర్కొన్నారు.

    వివరాలు 

    సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ప్రధాని ధన్యవాదాలు

    స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో దేశం ఎదుర్కొన్న వివిధ సమస్యలను పరిశీలించి ఈ చట్టాలను రూపొందించినందుకు సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

    చండీగఢ్ పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాలో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్‌ షా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా తదితరులు పాల్గొన్నారు.

    కార్యక్రమంలో పోలీసులు ఆధారాలను సేకరించే విధానంపై ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటు చేశారు, దీనిని ప్రధాని ఆసక్తిగా వీక్షించారు.

    ఈ కొత్త చట్టాలు భారతీయ న్యాయవ్యవస్థకు న్యాయం, సమర్థతను చేరువ చేస్తాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    చండీగఢ్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    India Mobile Congress 2024: త్వరలోనే పూర్తి మేడిన్‌ ఇండియా మొబైల్స్‌ .. డబ్ల్యూటీఎస్‌ఏ ఈవెంట్‌లో ప్రధాని మోదీ భారతదేశం
    PM Modi: పుతిన్ ఆహ్వానం.. మరోసారి రష్యాకు ప్రధాని నరేంద్ర మోదీ  రష్యా
    BRICS Summit 2024: నేడు నుంచి రష్యాలోనిబ్రిక్స్ సమ్మిట్ 2024.. ప్రధాని మోదీ - అధ్యక్షుడు పుతిన్ కీలక భేటీ.. వ్లాదిమిర్ పుతిన్
    BRICS Summit: రష్యాలో పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ.. వ్లాదిమిర్ పుతిన్

    చండీగఢ్

    చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ  పంజాబ్
    చండీగఢ్‌ పీజీఐ నెహ్రూ ఆస్పత్రిలో మంటలు,తప్పిన పెను ప్రమాదం భారతదేశం
    Karni Sena chief's murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్  రాజస్థాన్
    Unemployment rate: దేశంలో 13.4శాతానికి తగ్గిన గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు  ఉద్యోగం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025