English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు 
    స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు

    SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 08, 2025
    10:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే 'స్వమిత్వ పథకం' మళ్లీ కార్యరూపం దాల్చింది.

    మే నెలాఖరుకల్లా 10 లక్షల ఆస్తులకు సంబంధించి సర్వే పూర్తిచేసి, యాజమాన్య హక్కు పత్రాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడంతో, ఐదేళ్ల కాలంలో కేవలం 5 లక్షల ఆస్తులకు మాత్రమే యాజమాన్య హక్కులను నిర్ధారించారు.

    అందులోనూ మొత్తం 3 లక్షల ధ్రువపత్రాలే పంపిణీ చేశారు. ఎన్నికలకు ఏడాది ముందుగా ఈ పథకం నిలిచిపోగా, తాజాగా కూటమి ప్రభుత్వం మిగిలిన గ్రామాల్లో సర్వేను వేగవంతం చేసి, వచ్చే మూడేళ్లలో ప్రజలకు పూర్తి యాజమాన్య హక్కులు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసింది.

    Details

    సీఎం ఫొటోకు బదులుగా ప్రభుత్వ లోగో

    ప్రస్తుతం గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలను విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేసే హక్కు ప్రజలకు లేదు.

    అయితే స్వమిత్వ పథకంలో ఇచ్చే యాజమాన్య హక్కు పత్రాలతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం చట్ట సవరణ చేయనుంది.

    వైసీపీ హయాంలో 17,554 రెవెన్యూ గ్రామాల్లో కోటికి పైగా ఆస్తులు ఉండగా, కేవలం 1,410 గ్రామాల్లోనే సర్వే పూర్తయింది.

    మొత్తం 5 లక్షల ఆస్తులకే డ్రోన్ సర్వే నిర్వహించగా, ముద్రించిన 3 లక్షల ధ్రువపత్రాలపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉండటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

    అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా వాటిని ప్రజలకు పంపిణీ చేసింది.

    మీరు
    25%
    శాతం పూర్తి చేశారు

    Details

    పంచాయతీల ఆస్తులపై స్పష్టత 

    స్వమిత్వ సర్వే ద్వారా పంచాయతీలకు సంబంధించిన ఆస్తుల పట్ల స్పష్టత లభించనుంది.

    గ్రామాల్లో భవనాలు, చెరువులు, రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాలన్నింటినీ గుర్తించి, వాటిపై హక్కులను నిర్ధారించనున్నారు.

    5 వేల పంచాయతీల్లో భూములు, చెరువులు అక్రమంగా ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొన్ని భవనాలను స్థానిక పెద్దలు స్వాధీనం చేసుకుని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

    అలాగే పలు పంచాయతీ ఆస్తులకు సంబంధించిన అద్దెలు, లీజులు అక్రమంగా వినియోగిస్తున్న పరిస్థితిని సర్వే ద్వారా గుర్తించి వాటిని తిరిగి పంచాయతీలకు అప్పగించేలా చర్యలు తీసుకోనున్నారు.

    కోర్టు కేసులున్న ఆస్తుల విషయంలో తాత్కాలికంగా సర్వే ప్రక్రియను నిలిపివేయనున్నారు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    Details

     జగన్ ఫొటో ఉన్న కార్డుల భవిష్యత్తు? 

    వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ ఫొటోతో ముద్రించి పంపిణీ చేసిన ప్రోపర్టీ కార్డుల విషయంలో కూటమి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

    పాత కార్డులను వెనక్కి తీసుకుని కొత్త డిజైన్‌లో ముద్రించి పంపిణీ చేయాలా? లేక వాటినే కొనసాగించాలా? అనే అంశంపై అధికారులంతా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.

    అయితే అత్యధికంగా ప్రజలు పాత కార్డులను తిరిగి ఇచ్చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో, ప్రభుత్వం వాటిని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.

    తమ ఆస్తుల ధృవీకరణ పత్రంపై జగన్ ఫొటో ఎందుకు ఉండాలని పలువురు మండిపడుతున్నట్లు సమాచారం.

    మీరు
    75%
    శాతం పూర్తి చేశారు

    Details

    ముందుచూపుతో ప్రణాళిక రూపొందించిన కూటమి ప్రభుత్వం 

    కూటమి ప్రభుత్వం స్వమిత్వ పథకానికి కొత్త ఊపునిచ్చేందుకు తొలుత మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, మూడు సంవత్సరాల్లో అన్ని యాజమాన్య హక్కులను ప్రజలకు అందించేందుకు కార్యాచరణ రూపొందించింది.

    కొత్తగా ముద్రించే కార్డులు పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఉండేలా సీఎం ఫొటో స్థానంలో ప్రభుత్వ లోగోను ఉంచనుంది.

    పంచాయతీ ఆస్తులను కూడా స్పష్టంగా గుర్తించి అక్రమాలపై చర్యలు తీసుకునేలా వ్యవస్థను పటిష్ఠం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    వైసీపీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    Andhra News: పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు.. ఏపీ మారిటైం బోర్డు నిర్ణయం భారతదేశం
    Chandrababu: జాబ్స్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి : చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    Andhra News: ఏపీలో బ్యాటరీ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టు.. రూ.5,200 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా భారతదేశం
    Andhra pradesh: డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌.. తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు భారతదేశం

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    RGV VYUHAM : రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' విడుదలకు బ్రేక్‌.. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు
    TDP-Janasena New Logo: టీడీపీ-జనసేన కొత్త లోగో.. 'రా కదలి రా!'పేరుతో ప్రజల్లోకి.. జనసేన
    Dadi Veerabhadra Rao: వైసీపీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు  ఆంధ్రప్రదేశ్
    Kesineni Nani: కేశినేని నానికి షాకిచ్చిన టీడీపీ.. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి చంద్రబాబు నాయుడు

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025