NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Revanth Reddy: మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం
    తదుపరి వార్తా కథనం
    Revanth Reddy: మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం
    మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం

    Revanth Reddy: మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 21, 2025
    03:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మహిళా సమాఖ్య సభ్యులకు ప్రతేడాది రెండు చీరలు అందజేస్తామని ప్రకటించారు.

    నారాయణపేట జిల్లా పర్యటనలో అప్పక్‌పల్లెలో మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించిన సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు.

    మహిళా సమాఖ్యలో 67 లక్షల మంది సభ్యులుండగా, వారికి ప్రభుత్వం రూ.1000 కోట్ల వ్యయంతో ప్రతి ఏడాదీ రెండు మంచి చీరలు అందజేస్తుందని తెలిపారు.

    మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు.

    తదుపరి ప్రణాళికల్లో భాగంగా 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటును మహిళలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

    Details

    స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చొరవ చూపాలి

    ప్రతి జిల్లాలో ఒక స్థలంలో మహిళా సమాఖ్యలకు పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం ఒక బంక్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    గ్రామాల్లో ఉన్న స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చొరవ చూపించాలని సీఎం సూచించారు.

    ఉపాధ్యాయుల కొరత లేదా వసతుల సమస్యలుంటే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని, నిధుల విషయమై ప్రభుత్వ సాయమందిస్తామని హామీ ఇచ్చారు.

    అయితే నిధులు ఇచ్చినా నిర్వహణ సరిగా లేకపోతే ప్రయోజనం ఉండదని సీఎం స్పష్టం చేశారు.

    గుడిని ఎంత పవిత్రంగా నిర్వహిస్తామో, బడులను కూడా అదే విధంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    తెలంగాణ

    తాజా

    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..  జీవనశైలి
    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

    రేవంత్ రెడ్డి

    Rythu Panduga: రైతులకు గుడ్‌న్యూస్.. నేడు 3 లక్షలమంది రైతులకు రుణమాఫీ తెలంగాణ
    CM Revanthreddy: సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు : రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణ
    CM Revanth Reddy: సిద్దిపేటలో కోకాకోలా పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ
    Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి భారతదేశం

    తెలంగాణ

    Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. కొత్త దరఖాస్తులు, మార్పుల వివరాలు ఇవే! హైదరాబాద్
    New Ration Card: ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల అఫ్లికేషన్లు భారతదేశం
    Electricity Department: వేసవికి విద్యుత్‌ శాఖ ముందస్తు సన్నాహాలు ఇండియా
    Bhu Bharati: వారసత్వ భూ బదిలీకి ఆన్లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ.. చట్టంలోని అంశాల ఆధారంగా ఐచ్ఛికాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025