NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్‌ కలకలం.. ఒమిక్రాన్‌ బీఏ.2 నిర్ధారణ
    తదుపరి వార్తా కథనం
    Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్‌ కలకలం.. ఒమిక్రాన్‌ బీఏ.2 నిర్ధారణ
    విశాఖలో కొత్త వేరియంట్‌ కలకలం.. ఒమిక్రాన్‌ బీఏ.2 నిర్ధారణ

    Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్‌ కలకలం.. ఒమిక్రాన్‌ బీఏ.2 నిర్ధారణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 03, 2025
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణంలో గత నెలలో నమోదు అయిన కోవిడ్-19 కేసుల నమూనాలను పుణెకు పంపించి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)లో పరీక్షించగా, అవి ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని బీఏ.2 రూపాంతరంగా తేలినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

    విశాఖ కేజీహెచ్‌ వర్గాలు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాయి. అయితే ఈ వేరియంట్‌ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

    ఇక రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు కొద్దిగా పెరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా, రికార్డుల్లో మాత్రం అవి పూర్తిగా ప్రతిబింబించడం లేదు.

    ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.

    Details

    ప్రతిరోజూ వెయ్యి పరీక్షలు నిర్వహించాలి

    ప్రతిరోజూ కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

    పాత ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో (జీజీహెచ్‌) రోజుకు 100 పరీక్షల మేరకు, కొత్త జీజీహెచ్‌ల్లో రోజుకు 50 పరీక్షల మేరకు టెస్టింగ్‌ కిట్లను సిద్ధం చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

    ఇక ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ నేతృత్వంలో కొవిడ్‌ పరీక్షల నిర్వహణ, లబ్ధిదారులకు అందుబాటులో ఉన్న ప్రయోగశాలలు, టెస్టింగ్‌ కిట్లు, ఆక్సిజన్‌ ప్లాంట్లు తదితర అంశాలపై ప్రత్యేక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

    ఇందినిబట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మరలా అప్రమత్తమవుతూ, ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రజలు వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించడమే ప్రధానంగా సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    కోవిడ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    విశాఖపట్టణం

    PM Modi: ప్రధాని మోదీకి విశాఖలో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్  భారతదేశం
    Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్లు! భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం భారతదేశం
    Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం
    Vizag Steel: ప్యాకేజీతో హడావుడి..మరోపక్క సిబ్బంది తగ్గింపు..అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది? భారతదేశం

    కోవిడ్

    కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు కరోనా వేరియంట్
    Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత  వుహాన్ ల్యాబ్
    అమెరికాను మళ్లి కలవరపెడుతున్న కరోనా; పెరుగుతున్న ఆస్పత్రిలో చేరికలు, సీడీసీ హెచ్చరిక  అమెరికా
    వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్: జాగ్రత్తగా ఉండాలంటున్న WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025