NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nirmal: పర్యాటక ప్రియులకు శుభవార్త.. నిర్మల్ జిల్లాను టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Nirmal: పర్యాటక ప్రియులకు శుభవార్త.. నిర్మల్ జిల్లాను టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు
    నిర్మల్ జిల్లాను టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు

    Nirmal: పర్యాటక ప్రియులకు శుభవార్త.. నిర్మల్ జిల్లాను టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    04:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి ప్రధానకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి దిశగా చొరవ చూపుతోంది.

    చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలతో పాటు,మనోహరమైన ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగానికి కొత్త రూపు ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు రూపొందిస్తోంది.

    ఈక్రమంలోనే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను పర్యాటక హబ్‌లుగా తీర్చిదిద్దే పనిలో భాగంగా నిర్మల్ జిల్లా కూడా ప్రధానపాత్ర పోషించబోతోంది.

    ఈజిల్లాలోని చారిత్రక కోటలు,పురాతన బురుజులు,ఆకట్టుకునే జలపాతాలు,విలక్షణమైన వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా నిర్మల్‌ను ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి వ్యక్తం చేశారు.

    వివరాలు 

    శ్యామ్‌గడ్ కోటను పరిశీలించిన పటేల్ రమేశ్ రెడ్డి

    ఈ దిశగా ఆయన స్వయంగా నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా, చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన బంగల్‌పేట చెరువులోని బురుజును, అనేక శతాబ్దాల చరిత్రను తనలో నిగ్రహించుకున్న శ్యామ్‌గడ్ కోటను పరిశీలించారు.

    ఆయనతోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

    ఈ సందర్బంగా, ఆయా ప్రాంతాల చారిత్రక ప్రాముఖ్యతను గుర్తిస్తూ, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

    వివరాలు 

    బాసర నుండి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వరకు ప్రత్యేకమైన టూరిజం కారిడార్‌

    తరువాత మీడియాతో మాట్లాడిన పటేల్ రమేశ్ రెడ్డి, నిర్మల్ జిల్లా చరిత్ర, సంస్కృతి, ప్రకృతి సంపదలకు నిలయమని ప్రశంసించారు.

    ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కోటలు మరియు బురుజులను తిరిగి పూర్వవైభవంతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

    విద్యారంగంలో గుర్తింపు పొందిన బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వరకు ప్రత్యేకమైన టూరిజం కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.

    దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వివరించారు.

    వివరాలు 

    పర్యాటక రంగం అభివృద్ధి చెందితే, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

    ఈ పర్యాటక కారిడార్‌లో గోదావరి నదిపై ఉన్న ఎస్సారెస్పీ ప్రాజెక్టు అందాలు, కడెం ప్రాజెక్టు ప్రశాంతత, ప్రకృతి ఒడిలో ఉన్న కుంటాల జలపాతం యొక్క సౌందర్యం, పచ్చని అడవుల మధ్య ప్రవహించే పొచ్చెర జలపాతం వంటి అద్భుత దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    పర్యాటక రంగం అభివృద్ధి చెందితే, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక పరంగా ఈ ప్రాంతం బలోపేతమవుతుందని ఆయన వివరించారు.

    ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    చివరగా పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ, నిర్మల్ జిల్లాను రాష్ట్ర పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మల్

    తాజా

    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    నిర్మల్

    Monkey Meat : నిర్మల్‌లో కోతులను చంపి, వండుకొని తిన్నారు తెలంగాణ
    Bus Accident: కర్నూలు, నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయలు  రోడ్డు ప్రమాదం
    Budget 2024: వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 1 లక్షకు పెరగవచ్చు  బడ్జెట్ 2024
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025