NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nirmala Sitharaman: కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు.. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మల
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Nirmala Sitharaman: కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు.. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మల
    కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు.. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మల

    Nirmala Sitharaman: కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు.. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మల

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 14, 2025
    12:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు.

    రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ విభజన చట్టంలోని హామీలను నెరవేర్చినట్లు ఆమె స్పష్టం చేశారు.

    కేంద్రం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా, తెలంగాణ పరిస్థితి ఎందుకు మారలేదని ఆమె ప్రశ్నించారు.

    విభజన తర్వాత రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పాలకులు అప్పుల భారంగా మార్చేశారని విమర్శించారు.

    రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గురువారం, నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వరంగల్‌కు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఇచ్చామని, జహీరాబాద్‌కు పారిశ్రామిక నోడ్ కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం 2024 ఆగస్టులో ఆమోదం తెలిపిందని వివరించారు.

    వివరాలు 

    కేంద్రం చేసిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు: 

    కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి విభజన హామీలు ఏ మేరకు నెరవేరాయో ప్రశ్నించగా, ఆర్థికమంత్రి రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయ సహకారాల గురించి విశ్లేషించారు.

    విభజన చట్టం ప్రకారం సమ్మక్క-సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు.

    బీబీనగర్‌లో ఎయిమ్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన.

    2014 నుంచి 2,605 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం.

    భారత్‌మాల ప్రాజెక్టు కింద నాలుగు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ల మంజూరు.

    రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయింపు.

    753 కి.మీ. కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం.

    5 వందే భారత్ రైళ్ల ప్రారంభం.

    40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.

    పట్టణ ఆవాస్ యోజన కింద 2 లక్షల ఇళ్ల నిర్మాణం.

    వివరాలు 

    కేంద్రం చేసిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు: 

    స్వచ్ఛభారత్ మిషన్ కింద 31 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం.

    జల్ జీవన్ మిషన్ ద్వారా 38 లక్షల ఇళ్లకు తాగునీటి సరఫరా.

    82 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డుల మంజూరు.

    199 జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు.

    1.2 లక్షల జన్ ధన్ ఖాతాల ప్రారంభం.

    75 లక్షల ముద్రా లోన్లు మంజూరు.

    9 వెనుకబడిన జిల్లాలకు రూ.2,700 కోట్లు విరాళం.

    మెదక్‌కు తొలి రైల్వే స్టేషన్, రామగుండం ఎరువుల కర్మాగార పునరుద్ధరణ

    మెదక్ పార్లమెంటరీ ప్రాంతానికి తొలి రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంజూరు చేశారని, అలాగే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించిందీ కేంద్ర ప్రభుత్వమేనని నిర్మలా సీతారామన్ తెలిపారు.

    వివరాలు 

    కాంగ్రెస్‌పై కౌంటర్: 

    కాంగ్రెస్ పార్టీ కేవలం విమర్శలు చేస్తూ, ప్రజలకు నైతికమైన సమాధానాలు ఇవ్వడం లేదని ఆమె ధ్వజమెత్తారు.

    నిర్మలా సీతారామన్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

    తెలంగాణకు ముఖ్యమైన బయ్యారం స్టీల్ ప్లాంట్ సహా అనేక విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని పేర్కొన్నారు.

    కేంద్రం తన న్యాయమైన పన్నుల వాటా కూడా తెలంగాణకు ఇవ్వడం లేదని ఆరోపించారు.

    కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శలు చేయడంతో,నిర్మలా సీతారామన్ ప్రతిస్పందిస్తూ,దేశ ప్రజలు కాంగ్రెస్‌ను ఇప్పటికే తిరస్కరించారని అన్నారు.

    మహాత్మా గాంధీ 1947లోనే కాంగ్రెస్‌ పార్టీ రద్దు కావాలని సూచించారని,అయినప్పటికీ, కాంగ్రెస్ ఇంకా భారత రాజకీయాల్లో వేలాడుతోందని వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    నిర్మలా సీతారామన్

    Budget 2024 expectations: ఆదాయపు పన్ను మినహాయింపు,పెరగనున్న కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం; ఈసారి కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతుంది..? బడ్జెట్
    Budget 2024: బడ్జెట్‌ పై సమగ్ర సమాచారం..వాస్తవాలు , ముఖ్యంశాలు బడ్జెట్
    Budget 2024: ఆదాయపు పన్నుకు సంబంధించిన ఈ 6 రిలీఫ్‌లను బడ్జెట్‌లో ప్రకటించవచ్చు బిజినెస్
    Budget 2024: బడ్జెట్ లో ఈ 6 విషయాలు ప్రకటిస్తే మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు  బడ్జెట్ 2024
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025