NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court: ప్రైవేట్‌ ఆస్తుల స్వాధీనం కుదరదు.. తేల్చిచెప్పిన సుప్రీం
    తదుపరి వార్తా కథనం
    Supreme Court: ప్రైవేట్‌ ఆస్తుల స్వాధీనం కుదరదు.. తేల్చిచెప్పిన సుప్రీం
    ప్రైవేట్‌ ఆస్తుల స్వాధీనం కుదరదు.. తేల్చిచెప్పిన సుప్రీం

    Supreme Court: ప్రైవేట్‌ ఆస్తుల స్వాధీనం కుదరదు.. తేల్చిచెప్పిన సుప్రీం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 05, 2024
    02:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సుప్రీంకోర్టు ప్రైవేటు ఆస్తుల స్వాధీనం పై చారిత్రక తీర్పును వెలువరించింది.

    ప్రభుత్వాలు సామూహిక ప్రయోజనం కోసం అన్ని ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని కోర్టు 8:1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది.

    అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మినహాయింపులు ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

    ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరుగా పరిగణించవచ్చా? అనే కీలక ప్రశ్నపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కొన్నాళ్ల క్రితం కీలక వ్యాఖ్యలు చేసింది.

    వివరాలు 

    ప్రస్తుతకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానం తీర్పు

    ''ప్రైవేటు ఆస్తులను సమాజ వనరుగా చూడటం తగదు..ఈ విధానాలు పరస్పర విరుద్ధం. ప్రస్తుతకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం అవసరం'' అని అభిప్రాయపడింది.

    ''1950ల్లో భారతదేశ పరిస్థితుల ప్రాతిపదికన ఇప్పుడు వ్యాఖ్యానించకూడదు. అప్పట్లో జాతీయీకరణ జరిగేది. ఇప్పుడు ప్రైవేటు పెట్టుబడుల పెరుగుదల ఉంది. కాబట్టి న్యాయస్థానం వ్యాఖ్యానం సమకాలీనంగా ఉండాలి'' అని ధర్మాసనం పేర్కొంది.

    ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.

    ఇంతేకాక, కోల్‌కతాలో పార్కు నిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకున్న ఆస్తి విషయంలో కూడా సుప్రీం వ్యాఖ్యానిస్తూ, ''చట్ట ప్రకారం పరిహారం చెల్లించినా సరైన విధానాలు పాటించబడలేదు.

    వివరాలు 

    ఆస్తి స్వాధీనం ముందుగానే తెలియజేయాలి 

    ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినా, రాజ్యాంగం అందుకు తగిన రక్షణ కల్పించింది. హడావుడి స్వాధీనాలు, సరైన పరిహారం లేని నిర్ణయాలు పౌరులకు నష్టపరిచే అవకాశం ఉండదు'' అని స్పష్టం చేసింది.

    ఆస్తి స్వాధీనం ముందుగానే తెలియజేయడం, తగిన సమయం ఇవ్వడం, అభ్యంతరాలను పరిష్కరించడం వంటి చర్యలు ప్రభుత్వాలు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సుప్రీంకోర్టు

    Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్  అరవింద్ కేజ్రీవాల్
    #Newsbytesexplainer:'టూ-ఫింగర్-టెస్ట్'అంటే ఏమిటి? సుప్రీం కోర్టు నిషేధం ఉన్నప్పటికీ,ఈ రేప్ కేసులలోఇంకా ఇలానే ఎందుకు దర్యాప్తు జరుగుతోంది  భారతదేశం
    Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్టును సమర్పించే అవకాశం  కోల్‌కతా
    Kolkata rape murder case: కోల్‌కతా డాక్టర్ ఘటన కేసు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025