NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Omar Abdullah: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తొలి తీర్మానం అదే: ఒమర్‌ అబ్దుల్లా
    తదుపరి వార్తా కథనం
    Omar Abdullah: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తొలి తీర్మానం అదే: ఒమర్‌ అబ్దుల్లా
    జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తొలి తీర్మానం అదే

    Omar Abdullah: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తొలి తీర్మానం అదే: ఒమర్‌ అబ్దుల్లా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2024
    11:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలిచిన తరువాత, ముఖ్యమంత్రి పదవిని ఒమర్ అబ్దుల్లా చేపడుతారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.

    ఈ సందర్భంగా, పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, "జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇచ్చే విషయంలో తీర్మానాన్ని ప్రధానికి సమర్పిస్తాం." అలాగే, నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా వరుసగా ఉంటాయని తెలిపారు.

    కొంతమంది నేతలు జమ్మూకశ్మీర్‌ను దిల్లీతో పోల్చడంపై ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు.

    కశ్మీర్‌ను దిల్లీతో పోల్చవద్దని, ఎందుకంటే దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదని అన్నారు.

    వివరాలు 

    బీజేపీ , కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తోంది: ఒమర్ అబ్దుల్లా

    కానీ, కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని, హోంమంత్రి, బీజేపీ సీనియర్ మంత్రులు చెప్తున్నారని పేర్కొన్నారు.

    2019 వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంగానే ఉన్నట్లు గుర్తుచేశారు. కశ్మీర్‌లో శాంతిని కాపాడడం, అభివృద్ధికి పునాది వేయడం కోసం రాష్ట్ర హోదా అవసరమని తెలిపారు.

    బీజేపీ , కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

    అయితే ఆ పార్టీ ఎత్తులు ఫలించలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా తన పేరును తన తండ్రి ప్రకటించడంపై ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, "నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభా పక్ష సమావేశం అనంతరం మిత్రపక్షాలతో చర్చలు జరుపుకుని ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాం" అన్నారు.

    వివరాలు 

    జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వాలన్నది ఫరూక్ అబ్దుల్లా  డిమాండ్ 

    జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో 2019లో ప్రత్యేక ప్రతిపత్తి హోదా కోల్పోయింది.

    దీని ఫలితంగా ఆ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వాలన్నది ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది.

    ఒమర్ అబ్దుల్లా కూడా గత ఐదేళ్లుగా అందుకోసమే కష్టపడుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంతవరకూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో అడుగుపెట్టబోనని చెప్పారు.

    కానీ, యూటర్న్ తీసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

    కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే వరకు తన ప్రయత్నాన్ని విరమించుకోనని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025