NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / One Nation One Election: ఒకే దేశం-ఒకే ఎన్నికలు... 2029 తర్వాతే సాధ్యమన్న నిర్మలా సీతారామన్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    One Nation One Election: ఒకే దేశం-ఒకే ఎన్నికలు... 2029 తర్వాతే సాధ్యమన్న నిర్మలా సీతారామన్ 
    ఒకే దేశం-ఒకే ఎన్నికలు... 2029 తర్వాతే సాధ్యమన్న నిర్మలా సీతారామన్

    One Nation One Election: ఒకే దేశం-ఒకే ఎన్నికలు... 2029 తర్వాతే సాధ్యమన్న నిర్మలా సీతారామన్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 06, 2025
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2029లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతే 'జమిలి ఎన్నికలు' అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

    'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అనే ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని తెలిపారు. అప్పుడు ప్రారంభిస్తేనే 2034లో జమిలి ఎన్నికలు జరగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

    అయితే ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకముందే కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

    తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని కాట్టాన్‌కొళత్తూరు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 'ఒకే దేశం ఒకే ఎన్నిక' అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె, ఈ సందర్భంగా మాట్లాడారు.

    Details

    జమిలి ఎన్నికలతో ఖర్చు తగ్గే అవకాశం

    'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అనేది కొత్త ఆలోచన కాదని, ఇది చాలా కాలం క్రితమే వచ్చిన భావన అని ఆమె తెలిపారు.

    2024 లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిందని పేర్కొంటూ, జమిలి ఎన్నికలు జరిగితే ఈ భారీ ఖర్చును తగ్గించవచ్చని చెప్పారు.

    పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజల సొమ్ము ఆదా అవుతుందని వివరించారు.

    అయితే ఈ అంశంపై కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తుండటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

    Details

    అన్ని పార్టీలు మద్దతిస్తేనే అమలు

    జమిలి ఎన్నికలు ఎవరి వ్యక్తిగత కార్యక్రమం కాదని, అన్ని పార్టీలు మద్దతిస్తేనే అమలులోకి వస్తుందని తెలిపారు. డీఎంకే పార్టీపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు.

    డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ - "తండ్రి కరుణానిధి స్వీయ చరిత్రలో జమిలి ఎన్నికల అవసరాన్ని గుర్తించి మద్దతు ప్రకటించారు.

    కానీ ఇప్పుడు ఆయన కుమారుడు స్టాలిన్ మాత్రం రాజకీయ అవసరాల కోసం తండ్రి మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

    ప్రజలు ఈ విషయం గమనించాలని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమిలి ఎన్నికలు
    నిర్మలా సీతారామన్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    జమిలి ఎన్నికలు

    One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ  అసెంబ్లీ ఎన్నికలు
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  లోక్‌సభ
    One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్  రాహుల్ గాంధీ
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ

    నిర్మలా సీతారామన్

    Budget 2024: బడ్జెట్ లో ఈ 6 విషయాలు ప్రకటిస్తే మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు  బడ్జెట్ 2024
    Nirmala Sitharaman:7వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  భారతదేశం
    PM Surya Ghar: బడ్జెట్లో నిధులే నిధులు.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్  కేంద్ర ప్రభుత్వం
    Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు నిరాశే.. కొత్త రైళ్లు లేవు కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025