NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు దిగువన గొయ్యి.. మరమ్మతులు పూర్తి చేయాలన్న ఎన్డీఎస్‌ఏ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు దిగువన గొయ్యి.. మరమ్మతులు పూర్తి చేయాలన్న ఎన్డీఎస్‌ఏ 
    శ్రీశైలం ప్రాజెక్టు దిగువన గొయ్యి.. మరమ్మతులు పూర్తి చేయాలన్న ఎన్డీఎస్‌ఏ

    Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు దిగువన గొయ్యి.. మరమ్మతులు పూర్తి చేయాలన్న ఎన్డీఎస్‌ఏ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 07, 2025
    11:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యి (ప్లంజ్‌ పూల్‌) ను మే నెలాఖరు నాటికి పూడ్చివేయాలని జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ (ఎన్డీఎస్‌ఏ) సూచించింది.

    గురువారం సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ ఢిల్లీలోని కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తో కలిసి ప్లంజ్‌పూల్‌ మరమ్మతులపై సమీక్ష నిర్వహించారు.

    ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్, డ్యాం సేఫ్టీ సంస్థ సీఈ ప్రమీల, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ సీఈ మోహన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఎన్సీ వెంకటేశ్వరరావు, సీఈ ఖాదర్‌బాషా, ఎస్‌ఈ మోహన్‌కుమార్ హాజరయ్యారు.

    వివరాలు 

    గతేడాదే దీనిపై నివేదిక

    శ్రీశైలం ఆనకట్ట పునాది 380 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం ఏర్పడిన గొయ్యి 410 అడుగుల వరకు ఉందని గతంలో నిర్వహించిన హైడ్రో గ్రాఫిక్‌ సర్వే వెల్లడించింది.

    గేట్ల ద్వారా విడుదలయ్యే నీటి ప్రభావంతో ఈ గొయ్యి ఏర్పడిందని, దానిని తక్షణమే పూడ్చాల్సిన అవసరం ఉందని ఎన్డీఎస్‌ఏ ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టం చేసింది.

    గతేడాదే దీనిపై నివేదిక అందించినప్పటికీ ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.

    వివరాలు 

    ఏపీ, తెలంగాణ అభిప్రాయాలు 

    ఆంధ్రప్రదేశ్: ప్లంజ్‌పూల్‌ పై సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ ద్వారా అధ్యయనం చేపడుతున్నామని సమాధానం ఇచ్చింది.

    తెలంగాణ: కృష్ణా నదిలో వరదలు పెరిగినప్పుడు ఈ గొయ్యి ప్రమాదకర స్థాయికి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

    ముంబయి సముద్రతీరం కోత నివారించేందుకు ఉపయోగించే టెట్రా పాట్స్‌ ద్వారా మరింత కోతను అరికట్టవచ్చని సూచించింది.

    వివరాలు 

    ప్రాజెక్టుల యాజమాన్యంపై వివాదం 

    తెలంగాణ: శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఏపీకి, నాగార్జునసాగర్‌ బాధ్యతలు తమకు అప్పగించినట్లు రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని గుర్తు చేసింది.

    ఆంధ్రప్రదేశ్: రెండు ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి చేర్చుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసిందని తెలిపింది.

    తెలంగాణ: కృష్ణా జలాల అంశం కేడబ్ల్యూడీటీ-2 విచారణ పరిధిలో ఉందని, ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యమయ్యేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

    వివరాలు 

    డ్రిప్ పథకానికి శ్రీశైలం చేర్చాలని ఏపీ డిమాండ్ 

    ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న డ్రిప్‌ (ఆనకట్టల అభివృద్ధి పథకం) కింద శ్రీశైలం ప్రాజెక్టును చేర్చి నిధుల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.

    ఈ చర్చలను ఎన్డీఎస్‌ఏ అధికారిక మినిట్స్‌లో నమోదు చేయాలని తెలంగాణ కోరగా, దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది.

    ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ డిమాండ్‌ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీశైలం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    శ్రీశైలం

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం ఆంధ్రప్రదేశ్
    Srisailam Dam:ఎగువ నుంచి వరద.. నాగార్జునసాగర్‌ 22 గేట్ల ద్వారా నీటి విడుదల   భారతదేశం
    Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక రాష్ట్రం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025