NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్‌ అయిన ఉపగ్రహ చిత్రాలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్‌ అయిన ఉపగ్రహ చిత్రాలు 
    బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్‌ అయిన ఉపగ్రహ చిత్రాలు

    Operation Sindoor: బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్‌ అయిన ఉపగ్రహ చిత్రాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    10:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన క్రూర దాడికి భారత్‌ ఘాటైన ప్రతిస్పందన తెలిపింది.

    సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై మెరుపుదాడులు జరిపింది.

    ముఖ్యంగా లష్కరే తయ్యిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలపై లక్ష్యంగా 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో విస్తృత చర్యలు చేపట్టింది.

    ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది ఉగ్ర శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటి ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటపడ్డాయి.

    ఈ మెరుపుదాడుల సమయంలో జైషే మహ్మద్‌కు చెందిన బహవల్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయం, మురీద్కేలో ఉన్న లష్కరే తయ్యిబా ఉగ్రవాద శిబిరం తీవ్రంగా నాశనం కావడం విశేషం.

    వీటి శాటిలైట్‌ చిత్రాలను మాక్సర్‌ టెక్నాలజీ సంస్థ చిత్రీకరించింది.

    వివరాలు 

    80 మంది ఉగ్రవాదులు హతం 

    భారత్‌ క్షిపణుల దాడిలో బహవల్‌పూర్‌లో ఉన్న మర్కజ్‌ సుబాన్‌ గుంపు ప్రాంగణంలోని డోమ్‌ కూలిపోవడం ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

    మురీద్కే ప్రాంతంలోని లష్కరే శిబిరం పూర్తిగా నేలమట్టమైన దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి.

    ఈ మెరుపుదాడులు మంగళవారం అర్ధరాత్రి తరువాత సుమారు 25 నిమిషాల పాటు కొనసాగినట్టు సమాచారం.

    భారత్‌ ఈ దాడుల్లో పాక్‌ సైనిక స్థావరాలు లేదా నివాసాలపై దాడి చేయకుండా కేవలం ఉగ్ర శిబిరాలనే లక్ష్యంగా చేసుకుంది.

    ఈ దాడుల ఫలితంగా దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అంచనా. ఈ ఘటనతో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉత్కంఠ మరింత పెరిగింది.

    వివరాలు 

    భారత్‌ ముందస్తు జాగ్రత్తగా చర్యలు

    ఆపరేషన్‌ సిందూర్‌ తరువాత పాకిస్థాన్‌ తక్షణమే ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉండటంతో, భారత్‌ ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది.

    సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా పంజాబ్‌ రాష్ట్రంలో హై అలర్ట్‌ ప్రకటించారు.

    ప్రజల భద్రత దృష్ట్యా అన్ని రకాల బహిరంగ కార్యక్రమాలను రద్దు చేశారు. అంతేకాదు, విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్‌ అవుతున్న ఉపగ్రహ చిత్రాలు

    Satellite images from Maxar Technologies show damage caused by Indian missile strike on Jamia Masjid in #Bahawalpur ,Pakistan before (Image 1) and after the attack (Images 1,2,3)#Sialkot #Airstrike #India #IndianArmy #BreakingNews #Justin #IndiaPakistan #OprationSindoor #lahore pic.twitter.com/y3PGTxlLuN

    — Indian Observer (@ag_Journalist) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Operation Sindoor: బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్‌ అయిన ఉపగ్రహ చిత్రాలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Stock market: దేశీయ, అంతర్జాతీయ పరిణామాల వేళ.. నేడు ఫ్లాట్‌గా కొనసాగుతున్న దేశీయ మార్కెట్ సూచీలు స్టాక్ మార్కెట్
    Pakistan: : పాకిస్తాన్‌ లాహోర్‌లో పేలుడు.. పరుగు తీసిన ప్రజలు పాకిస్థాన్
    Air India, Air India Express: సాయుధ దళాలకు ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తోడ్పాటు  ఎయిర్ ఇండియా

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025