NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Haldwani: హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు
    తదుపరి వార్తా కథనం
    Haldwani: హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు
    హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు

    Haldwani: హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 09, 2024
    08:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌ హల్ద్వానీలో బన్‌భూల్‌పురాలో హల్ద్వానీలోని మాలిక్ తోటలో అక్రమంగా ఆక్రమించిన మదర్సాలు, మతపరమైన స్థలాలను కూల్చివేస్తున్న సందర్భంగా భారీగా అల్లర్లు చోటు చేసుకున్నాయి.

    బన్‌భూల్‌పురాలో అక్రమంగా నిర్మించినమదర్సా, ప్రక్కనే ఉన్న మసీదు కూల్చివేతపై అక్కడి నివాసితులు వాహనాలు, పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టడం, రాళ్లు రువ్వడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు.

    వార్తా సంస్థ పిటిఐ ప్రకారం, ఆసుపత్రిలో చేరిన వారిలో ఎక్కువ మంది పోలీసు సిబ్బంది. మిగిలిన వారు స్థానిక మదర్సా,దాని కాంప్లెక్స్‌లోని మసీదు కూల్చివేతలో పాల్గొన్న మున్సిపల్ కార్మికులు.

    ఈ కాల్పుల్లో బన్‌భూల్‌పురా ప్రాంతానికి చెందిన నలుగురు చనిపోయారు.

    Details 

    నిలిచిన ఇంటర్నెట్ సేవలు

    ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో గురువారం జరిగిన హింసాకాండలో నలుగురు వ్యక్తులు మరణించారని AP అన్షుమాన్,రాష్ట్ర ADG లా అండ్ ఆర్డర్ వార్తా సంస్థ ANIకి ధృవీకరించారు.250మందికి పైగా పోలీసులు గాయపడ్డారని,వారిని ఆసుపత్రులకు తరలించారని ఆయన చెప్పారు.

    రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ధృవీకరించింది.రాత్రి 9గంటల తర్వాత నగరంలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి.నైనిటాల్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని కూడా పరిపాలన ఆదేశించింది.హింస పెరగడంతో హల్ద్వానీలోని దుకాణాలన్నీ మూతపడ్డాయి.

    రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హల్ద్వానీలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి,డీజీపీ అభినవ్ కుమార్‌తో సహా సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని,"అరాచక అంశాల" పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ఉత్తరాఖండ్

    కేదార్‌నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మందికిపైగా గల్లంతు కేదార్‌నాథ్ యాత్ర
    ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు  భారీ వర్షాలు
    Uttarakhand: రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి  కేదార్‌నాథ్ యాత్ర
    IMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ  ఐఎండీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025