NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం 
    తదుపరి వార్తా కథనం
    భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం 
    భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం

    భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం 

    వ్రాసిన వారు Stalin
    Aug 19, 2023
    11:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది వర్షాకాలంలో వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడటంతో భారత‌దేశంలో మొత్తం 2,038 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం హోంశాఖ తెలిపింది.

    బిహార్‌లో అత్యధికంగా 518 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 330 మంది మరణించారు. వర్షాల సమయంలో 101మంది గల్లంతయ్యారు. 1,584 మంది గాయపడ్డారు.

    ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 17 వరకు సంభవించిన వరదల నష్టంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. అందులో ఈ అంశాలను వెల్లడించింది.

    కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దేశంలోని 335 జిల్లాలు వర్షాలు, కొండచరియలు, మెరుపులతో ప్రభావితమయ్యాయి, వీటిలో మధ్యప్రదేశ్‌లో 40, అస్సాంలో 30, ఉత్తరప్రదేశ్‌లో 27 ఉన్నాయి.

    వర్షం

    పిడుగుపాటుకు 506మంది మృతి

    మరో వైపు హిమాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాలు, ఉత్తరాఖండ్‌లోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

    వరదల కారణంగా 892 మంది, పిడుగుపాటుకు 506మంది, కొండచరియలు విరిగిపడటంతో 186 మంది మరణించారని హోం మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో 454 మంది ఈ సీజన్‌లో అనేక ఇతర కారణాల వల్ల మరణించారు.

    వర్షాలు, వరదలు, కొండచరియలు, పిడుగుల కారణంగా గుజరాత్‌లో 165 మంది, మధ్యప్రదేశ్‌లో 138 మంది, కర్ణాటక, మహారాష్ట్రలో 107మంది చొప్పున, ఛత్తీస్‌గఢ్‌లో 90మంది, ఉత్తరాఖండ్‌లో 75మంది మరణించారు.

    హిమాచల్ ప్రదేశ్‌లో 17, మహారాష్ట్రలో 14, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో ఒక్కొక్కటి 12, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో 10 చొప్పున, ఉత్తరాఖండ్‌లో 9 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు.

    వర్షం

    'ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం'గా హిమాచల్ ప్రదేశ్

    హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మొత్తం రాష్ట్రాన్ని 'ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం'గా ప్రకటించింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తీవ్రనష్టాన్ని చవిచూసింది.

    భారీగా ప్రాణనష్టం, విధ్వంసం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టాన్ని రాష్ట్రం ఎదుర్కొంది. కొండచరియలు విరిగిపడటం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది.

    వేలాది సంఖ్యలో నివాస గృహాలు దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఆస్తి, పశువులు, మౌలిక సదుపాయాలు, పంటల నష్టాల అంచనాలను సంబంధిత జిల్లా అధికారులు, శాఖలు నిర్వహిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారీ వర్షాలు
    హిమాచల్ ప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    భారీ వర్షాలు

    అమెరికాలో భారీ వర్షాలు.. 2600 విమానాలు రద్దు అమెరికా
    Typhoon Talim: చైనాను వణిస్తున్న'తాలిమ్ టైఫూన్' తుపాను; విమానాశ్రయాలు, పాఠశాలలు మూసివేత  చైనా
    ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍‌లో 122కు చేరిన మృతులు  ఐఎండీ
    IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం ఐఎండీ

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    తాజా వార్తలు

    హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ  హర్యానా
    ఈవారం చిన్న సినిమాల హవా; ఓటీటీ/ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే  ఓటిటి
    Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి  తిరుపతి
    చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ  చండీగఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025