NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.17 కోట్ల మంది
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.17 కోట్ల మంది
    తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.17 కోట్ల మంది

    Telangana: తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.17 కోట్ల మంది

    వ్రాసిన వారు Stalin
    May 12, 2024
    05:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మే 13న మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైనందున తెలంగాణలో దాదాపు 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

    ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది.

    హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కూడా పోలింగ్ జరగనుంది.

    రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులు.

    వీరిలో 1,58,71,493 మంది పురుషులు, 1,58,43,339 మంది మహిళలు, 2,557 మంది థర్డ్ జెండర్ ఉన్నారు.

    Details 

    రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్‌ కేంద్రాలు 

    ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం 20,163 మంది ఓటర్లు ఇంటింటికి ఓటు వేసే సదుపాయాన్ని వినియోగించుకున్నారు.

    పోల్ డ్యూటీలో ఉన్న 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను వినియోగించుకున్నారు.

    రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రిని సేకరించిన అనంతరం సిబ్బంది ఆదివారం సాయంత్రంలోగా తమ తమ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారు.

    దాదాపు లక్ష మంది భద్రతా సిబ్బందితో సహా మొత్తం 2.94 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు.

    రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS,BJP మధ్య త్రిముఖ పోటీ ఉంది.

    Details 

    ఆదిలాబాద్ (ఎస్టీ) నియోజకవర్గంలో 12మంది అభ్యర్థులు

    సికింద్రాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు ఉన్నారు.

    మెదక్‌లో మొత్తం 44మంది అభ్యర్థులు,చేవెళ్లలో 43మంది, పెద్దపల్లె (ఎస్సీ), వరంగల్ (ఎస్సీ) నియోజకవర్గాల్లో 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

    ఆదిలాబాద్ (ఎస్టీ) నియోజకవర్గంలో కేవలం 12 మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు.

    కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు.

    బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

    మహబూబ్‌నగర్‌ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బరిలో ఉన్నారు.

    ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌ నుంచి వరుసగా ఐదోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

    Details 

    106 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ వేళలు మార్పు 

    2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది.

    కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకోగా, ఏఐఎంఐఎం ఒక్క సీటును నిలబెట్టుకుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

    106 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ వేళలను ముందుగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు.

    రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తిని, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఎన్నికల సంఘం మే 1న ఒక గంట పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించింది.

    అయితే, ఐదు లోబ్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 లెఫ్ట్ వింగ్ తీవ్రవాద (LWE) ప్రభావిత సెగ్మెంట్లలో పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.

    Details 

    అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో 71.34 శాతం పోలింగ్

    2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో 71.34 శాతం పోలింగ్ నమోదైంది.

    2018 అసెంబ్లీ ఎన్నికల్లో 73.73 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 62.11 శాతానికి పడిపోయింది. పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లలో భాగంగా 160 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.

    తెలంగాణ నుంచి 72 వేల మంది, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 20వేల మంది, ఇతర యూనిఫాం సర్వీసులకు చెందిన 4 వేల మంది సిబ్బందిని నియమించనున్నట్లు సీఈవో తెలిపారు.

    ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంలు)వివరాలను పంచుకుంటూ 1,05,019 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    మొత్తం 44,569 కంట్రోల్ యూనిట్లు(సియులు),48,134 వివిపిఎటిలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.

    Details 

     8,600 మందిపై కేసులు 

    ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ముగ్గురు ఈసీఐఎల్ ఇంజనీర్లను ఈవీఎంలు పనిచేయక పోవడంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు నియమించారు.

    మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లఘించినవారి 8,600 మందిపై కేసులు నమోదు చేశారు.

    ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రూ.320.84 కోట్ల నగదు, ఇతర ఫ్రీబీలను స్వాధీనం చేసుకున్నాయి.

    రాష్ట్రవ్యాప్తంగా 1.96 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారని సీఈవో తెలిపారు.

    3,522 మంది సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు ఉంటారు. పోల్ ప్యానెల్ 12,909 మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించింది.

    Details 

     22 పోలింగ్‌ కేంద్రాల్లో 50లోపు ఓటర్లు 

    మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,809 కాగా, సహాయక పోలింగ్ కేంద్రాలు 453 ఉన్నాయి.

    మూడు అతి చిన్న పోలింగ్ స్టేషన్లలో వరుసగా 10, 12, 14 మంది ఓటర్లు ఉన్నారు.

    11 పోలింగ్‌ కేంద్రాల్లో 25లోపు ఓటర్లు ఉండగా, 22 పోలింగ్‌ కేంద్రాల్లో 50లోపు ఓటర్లు ఉన్నారు.

    54 పోలింగ్‌ కేంద్రాలు 100 కంటే తక్కువ ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత.

    శనివారం, ఎన్నికల సంఘం పోలింగ్ ముగింపు సమయంతో ముగిసే 48 గంటల పాటు ఎన్నికలకు సంబంధించిన బల్క్ ఎస్‌ఎంఎస్‌లను నిషేధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఎన్నికలు

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    తెలంగాణ

    Congress: ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్  కాంగ్రెస్
    TSRTC fitment: ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్‌ ప్రకటించిన తెలంగాణ సర్కార్  టీఎస్ఆర్టీసీ
    Yadadri: సోమవారం నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం  యాదాద్రి
    CM Revanth Reddy: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి  యాదాద్రి

    ఎన్నికలు

    Pakistan poll result: లండన్ ప్లాన్ విఫలమైంది: ఇమ్రాన్ ఖాన్ 'విక్టరీ' స్పీచ్  ఇమ్రాన్ ఖాన్
    Pakistan election: నవాజ్ షరీఫ్‌, బిలావల్ భుట్టో మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు  పాకిస్థాన్
    PM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్‌లో మారిన నంబర్ గేమ్  చండీగఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025