NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం 
    ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం

    Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2025
    01:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.

    ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. చలి తీవ్రత అధికమైనందున, ఈ ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది.

    దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

    ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో దృశ్యమానత దారుణంగా తగ్గిపోయింది.

    కొన్నిచోట్ల విజిబిలిటీ జీరోకు చేరడంతో రహదారులపై వాహనాలు ముందుకు సాగడం కష్టమైంది. పొగమంచు ప్రభావంతో ఢిల్లీలో విమాన, రైలు సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

    వివరాలు 

    200కిపైగా విమానాలు ఆలస్యంగా

    ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 6 గంటలకు విజిబిలిటీ 100 మీటర్లకు తగ్గిపోయింది.

    దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలు సాగించే 200కిపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి.

    కొన్ని విమానాలు రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాలకు మళ్లించారు. ఈ ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    ఈ పరిస్థితుల్లో ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్‌ ఇండియా వంటి విమాన సంస్థలు తమ ప్రయాణికులకు ముందుగానే సూచనలు చేశారు. ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించారు.

    వివరాలు 

    ఆలస్యంగా 26 రైళ్లు

    పొగమంచు ప్రభావంతో కనీసం 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

    వాతావరణ శాఖ అంచనా ప్రకారం, బుధవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉండి సాయంత్రం తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.

    ఈ చలి తీవ్రతతో పాటు, ఢిల్లీలో వాయు నాణ్యతా స్థాయి కూడా పేలవంగా ఉంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ లెవెల్స్ 332గా నమోదయ్యాయి, ఇది చాలా అధ్వాన్నమైన స్థాయిగా భావించబడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    వాయు కాలుష్యం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    దిల్లీ

    Dilli Chalo: ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అంబాలాలో నిషేధాజ్ఞలు భారతదేశం
    Delhi: రైతుల పాదయాత్ర.. సరిహద్దుల్లో కంక్రీట్ వాల్, రోడ్డుపై మేకులు ఇండియా
    CBI Rides: దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. 11 ప్రదేశాలలో భారీగా నగదు స్వాధీనం! సీబీఐ
    Delhi: ఢిల్లీలోని 40కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు బాంబు బెదిరింపు

    వాయు కాలుష్యం

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు హైదరాబాద్
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని  దిల్లీ
    Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు దిల్లీ
    Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025