NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi in Gujarat: నేడు గుజరాత్ లో పర్యటించనున్న ప్రధాని
    తదుపరి వార్తా కథనం
    Modi in Gujarat: నేడు గుజరాత్ లో పర్యటించనున్న ప్రధాని
    Modi in Gujarat: నేడు గుజరాత్ లో పర్యటించనున్న ప్రధాని

    Modi in Gujarat: నేడు గుజరాత్ లో పర్యటించనున్న ప్రధాని

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 22, 2024
    08:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్‌లో పర్యటించనున్నారు.ఈసందర్భంగా రాష్ట్రంలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన చేయనున్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో రూ.48,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి,గురువారం జాతికి అంకితం చేస్తారని బుధవారం PMO ప్రకటన తెలిపింది.

    ముందుగా మధ్యాహ్నం అహ్మదాబాద్‌కు ప్రధాని చేరుకుంటారు.అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 1.25 లక్షల మందికి పైగా రైతులు హాజరయ్యే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్)స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

    ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్ర పశుసంవర్ధక శాఖమంత్రి పురుషోత్తం రూపాలా,గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ లు కలిసి అమూల్ యొక్క 1200 కోట్ల రూపాయల విలువైన ఐదు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

    Details 

    వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన

    మధ్యాహ్నం 12:45 గంటలకు, ప్రధానమంత్రి మెహసానాకు చేరుకుని 'పూజ' చేసి వాలినాథ్ మహాదేవ్ ఆలయంలో 'దర్శనం' చేస్తారు.

    ఆ తర్వాత మహేసన,నవ్‌సారిలో జరిగే రెండు బహిరంగ సభలలో మోదీ పాల్గొంటారు.

    ఈ కార్యక్రమంలో ఆయన రూ. 25,850 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు.

    అలాగే, ప్రధాని మోడీ రూ. 10,700 కోట్లతో నిర్మించనున్న వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేయనున్నారు.

    సూరత్ జిల్లాలోని తాపీ కక్రాపర్‌లో 22,500 కోట్ల రూపాయలతో నిర్మించిన రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే తొలి స్వదేశీ అణు విద్యుత్ కేంద్రంగా అవతరించనుంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్

    తాజా

    Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి జీవనశైలి
    ISRO: 18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్ ఇస్రో
    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ

    గుజరాత్

    తల్లికి షాక్ ఇచ్చిన బాలిక.. సెల్ ఫోన్ లాక్కుందని చక్కెర డబ్బాలో పురుగుల మందు పెట్టిన కూతురు  భారతదేశం
    10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు రాజ్యసభ
    హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్ ఉగ్రవాదులు
    గుజరాత్‌‌లో కుండపోత వర్షం; 9మంది మృతి వర్షాకాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025