
P4 Model: ఏపీలోని ఆ గ్రామంలో పీ4 లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం"పీ-4 జీరో పావర్టీ"అనే ప్రోగ్రామ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ ప్రోగ్రామ్లో ఎంపిక చేసిన పదిమంది పేదల పేర్లను ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఇది ఆయన లబ్ధిదారుల పేర్లను ప్రకటించడం మొదటిసారి. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో ఇవాళ పర్యటించిన చంద్రబాబు,ఆగ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా,పీ4ప్రోగ్రామ్లో గుర్తించిన పది మంది పేదల పేర్లను చంద్రబాబు ప్రకటించి,వారి జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
పేదరికంతో బాధపడుతున్న,కూలీ పనులు చేసి,క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓమహిళ ధీన పరిస్థితి గురించి తెలుసుకున్న చంద్రబాబు,ఆమెకు వైద్యం చేయించడానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు
రాజకీయ పార్టీలు నన్ను విమర్శిస్తున్నాయి: చంద్రబాబు
పీ4 ప్రోగ్రామ్లో పేదలను దత్తత తీసుకున్న సంపన్నులు ఎవరైనా మధ్యలో చేతులెత్తేస్తే ,వారి స్థానంలో కొత్తవారు వస్తారని,కానీ పీ4 యజ్ఞం మాత్రం కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
కొన్ని రాజకీయ పార్టీలు తనను విమర్శిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.వారికి చేతనైతే, 100 మందిని దత్తత తీసుకుని వారి జీవితాలను బాగు చేయాలని సూచించారు.
అలాచేస్తే, శాలువా కప్పి, పూలమాల వేసి వారికి గౌరవం ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
పీ4 ప్రోగ్రామ్లో ఫార్మా కంపెనీ అధినేత విక్రం నాగేశ్వరరావు ముందుకు వచ్చారు.
ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఉన్న 9వ తరగతి విద్యార్థిని చదవించే బాధ్యతను తీసుకున్న విక్రం, గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.