NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala: 270 సంవత్సరాల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన 'మహా కుంభాభిషేకం' 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kerala: 270 సంవత్సరాల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన 'మహా కుంభాభిషేకం' 
    270 సంవత్సరాల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన 'మహా కుంభాభిషేకం'

    Kerala: 270 సంవత్సరాల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన 'మహా కుంభాభిషేకం' 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 02, 2025
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఘనమైన చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో సుదీర్ఘ విరామం తర్వాత ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక ఘట్టం జరగనుంది.

    వచ్చే జూన్ 8న ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ఆలయ పునర్నిర్మాణం పూర్తి కావడంతో, ఆలయ పవిత్రతను పరిరక్షించడంలో భాగంగా ఈ మహా కుంభాభిషేకాన్ని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు.

    ఆలయ ఆధ్యాత్మిక శక్తిని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం వెనక ఉద్దేశమని ఆలయ అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

    వివరాలు 

    కలశాలకు ప్రతిష్ఠాపనతో పాటు కొత్త విగ్రహ ఏర్పాట్లు 

    శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం గర్భగుడిపై మూడు కలశాలు, ఒట్టక్కల్ మండపంపై ఒక కలశం స్థాపించబడ్డాయి.

    జూన్ 8న వీటికి ప్రతిష్ఠాపన పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు ఆలయంలో విశ్వక్సేనుని సరికొత్త విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు.

    ఆలయ ప్రధాన ప్రాంగణంలో ఉన్న తిరువంబాడి శ్రీకృష్ణుని మందిరంలో అష్టబంధన కలశ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది.

    ఈ విషయాలను ఆలయ మేనేజర్ బి.శ్రీకుమార్ మీడియాకు వెల్లడించారు.

    జూన్ 8న ఆలయం కాంప్లెక్స్‌లోనే మహా కుంభాభిషేక పూజలు జరుగుతాయని, రాబోయే కొన్ని దశాబ్దాల్లోనూ ఆలయంలో ఈ తరహా ప్రత్యేక పూజలు జరిగే అవకాశం లేదన్నారు.

    వివరాలు 

    పునర్నిర్మాణ పనుల నేపథ్యం 

    పద్మనాభస్వామి ఆలయంలో పునర్నిర్మాణ పనులు 2017లో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ చేపట్టబడ్డాయి.

    ఆ ఏడాదే మొదలైన పనులు, కరోనా మహమ్మారి కారణంగా కొన్ని రోజులు నిలిచిపోయాయి.

    అనంతరం 2021 నుండి పలు దశల్లో పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయని బి.శ్రీకుమార్ తెలిపారు.

    ఆయన మాటల్లోనే, ఆలయంలో ఇంత విస్తృతంగా పునర్నిర్మాణ పనులు జరిగి, అవి పూర్తవగానే ఇంతటి భారీ పూజా కార్యక్రమాలు జరగడం అనేది ఎన్నో శతాబ్దాల తర్వాతి అరుదైన అవకాశం.

    ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొనాలనుకునే భక్తులకు ఇది ఎంతో అరుదైన అవకాశమని ఆయన పేర్కొన్నారు.

    వివరాలు 

    శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ విశిష్టత 

    శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రంగా తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుర్తించబడింది.

    ఇక్కడ పాలకడలిలో శేషతలపైన పడి విశ్రాంతిచేస్తున్న మూర్తి రూపాన్ని దర్శించవచ్చు. ఈ ఆలయం ఆధ్యాత్మికంగా, శిల్పకళ పరంగా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    కేరళ

    Kerala: 1500 మంది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెన్షన్‌.. వడ్డీతో సహా వసూలు చేయాలని మంత్రి ఆదేశం భారతదేశం
    Kerala Accident: కేరళలో బస్సును కారు ఢీకొని.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి  రోడ్డు ప్రమాదం
    BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు! కేంద్ర ప్రభుత్వం
    Kerala: కేరళలో రోడ్డు ప్రమాదం.. నవదంపతులతో సహా నలుగురు మృతి రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025