NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు
    పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు

    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    08:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత సరిహద్దుల్లో దాడులకు పాకిస్థాన్‌ తెగబడుతోంది. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

    ఉగ్రవాదంపై పోరు తలపెట్టిన భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు పాకిస్థాన్‌ దాడులకు దిగింది.

    అందులో భాగంగా జమ్ముకశ్మీర్‌తోపాటు, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యాణా సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది.

    అయితే భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ విషయమై భారత ఆర్మీ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

    వివరాలు 

    ప్రజల భద్రతతో పాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం భారత ఆర్మీ ప్రధాన కర్తవ్యం

    ''డ్రోన్లు,వివిధ రకాల ఆయుధాలతో పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోంది. గురువారం రాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌ ఎల్‌ఓసీ వద్ద పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్‌ డ్రోన్‌ దాడులను సమర్థంగా ఎదుర్కొని వాటిని తిప్పికొటాం. ప్రజల భద్రతతో పాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం భారత ఆర్మీ ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నాం. పాకిస్థాన్‌ కుట్రలకు తక్షణమే స్పందించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం'' అని భారత సైన్యం ప్రకటించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇండియన్ ఆర్మీ చేసిన ట్వీట్ 

    OPERATION SINDOOR

    Pakistan Armed Forces launched multiple attacks using drones and other munitions along entire Western Border on the intervening night of 08 and 09 May 2025. Pak troops also resorted to numerous cease fire violations (CFVs) along the Line of Control in Jammu and… pic.twitter.com/WTdg1ahIZp

    — ADG PI - INDIAN ARMY (@adgpi) May 9, 2025

    వివరాలు 

    సైనిక స్థావరాలు ప్రధాన లక్ష్యం 

    పాకిస్థాన్‌ దాడుల్లో ముఖ్యంగా భారత సైనిక స్థావరాలు ప్రధాన లక్ష్యంగా నిలిచాయి.

    జమ్మూ విమానాశ్రయం, అక్కడి సైనిక కేంద్రాలపై దాడులకు యత్నించింది.

    పాక్‌ పంపిన డ్రోన్లు, మూడు యుద్ధ విమానాలను భారత భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకుని నేలమట్టం చేశాయి.

    రాజస్థాన్‌లోని రామ్‌గర్‌, జైసల్మేర్‌ ప్రాంతాల్లోని బీఎస్‌ఎఫ్‌ శిబిరాలపై జరిగిన దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది.

    అంతేకాకుండా, జమ్మూకశ్మీర్‌ ప్రాంతంలో పౌరుల వాహనాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం తెలంగాణ
    Operation Sindoor: భారత్‌-పాక్‌ మధ్య యుద్ధంలో జోక్యం చేసుకోబొం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అమెరికా

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025