NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vyomika Singh : రాడార్ కేంద్రాలే లక్ష్యంగా పాక్ దాడులు.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ 
    తదుపరి వార్తా కథనం
    Vyomika Singh : రాడార్ కేంద్రాలే లక్ష్యంగా పాక్ దాడులు.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ 
    రాడార్ కేంద్రాలే లక్ష్యంగా పాక్ దాడులు.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్

    Vyomika Singh : రాడార్ కేంద్రాలే లక్ష్యంగా పాక్ దాడులు.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2025
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ తన దుర్మార్గపు చర్యలను ఏమాత్రం ఆపడం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతూ, పాక్ ఫైటర్ జెట్లు పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయని సమాచారం.

    పంజాబ్‌లోని అనేక కీలక ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు దిగుతున్నాయి.

    అంతటితో ఆగకుండా, శ్రీనగర్‌లోని పాఠశాలలు, ఆసుపత్రుల వంటి పౌర ప్రాంతాలపై కూడా దాడులు చేయడం మానవత్వాన్ని మరిచిన చర్యగా భావించాల్సిన అవసరం ఉందని వింగ్‌ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు.

    ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, పాక్ ఈ చర్యలు అత్యంత హేయంగా, నీచంగా కొనసాగిస్తోంది.

    సైనిక స్థావరాలతో పాటు పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వారి దురుద్దేశాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు.

    Details

    విద్యా సంస్థలు, ఆస్పత్రులపై దాడులు చేయడం అన్యాయం

    పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిపి భారత వైమానిక శక్తిని బలహీనపరచాలని పాకిస్తాన్ కుట్ర చేస్తోందన్నారు.

    అదే విధంగా, శ్రీనగర్‌లోని విద్యా సంస్థలు, వైద్యాలయాలపై దాడులు జరపడం మానవత్వాన్ని పక్కనపెట్టి పిరికి చర్యలకు పాల్పడుతున్న వారి అసలైన స్వభావాన్ని వెల్లడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

    రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను టార్గెట్ చేస్తూ భారత్‌ రక్షణ వ్యవస్థపై దాడులకు దిగుతున్న పాక్, ఈ చర్యలతో ప్రాంతీయంగా తీవ్ర భయ వాతావరణాన్ని సృష్టిస్తోంది.

    అమాయక ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా వైమానిక దాడులు చేస్తోంది.

    అయినప్పటికీ, భారత సైన్యం అప్రమత్తంగా ఉండి, శత్రువుల ప్రతి చర్యకు దీటుగా ఎదురుదెబ్బ ఇస్తోందని వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీనగర్

    తాజా

    Vyomika Singh : రాడార్ కేంద్రాలే లక్ష్యంగా పాక్ దాడులు.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్  శ్రీనగర్
    BSF: భారత్‌ను దెబ్బతీయాలన్న పాక్ ప్లాన్‌ ఫెయిల్.. లాంచ్‌ప్యాడ్‌ను ధ్వంసం చేసిన బీఎస్ఎఫ్ జమ్ముకశ్మీర్
    Hostels Closed at Andhra University: భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం.. విశాఖ ఏయూలో హాస్టళ్లు మూసివేత విశాఖపట్టణం
    Char Dham Yatra: భారత-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఛార్ ధామ్ యాత్ర రద్దు! ఇండియా

    శ్రీనగర్

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు జమ్ముకశ్మీర్
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జీ20 సమావేశం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025