
Amit Shah: హింస కాదు, శాంతే మార్గం.. మావోయిస్టులకు అమిత్ షా పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో భద్రతా బలగాలు మావోయిస్టులకు కడగండ్లుగా మారాయి.
శనివారం సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లో ఇది భద్రతా బలగాల ఘన విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు.
ఈ విజయాన్ని మావోయిజానికి మరో నిర్ణయాత్మక దెబ్బగా అభివర్ణించిన అమిత్ షా, 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు.
సుక్మాలో జరిగిన ఆపరేషన్లో భద్రతా బలగాలు 16 మంది నక్సలైట్లను మట్టుబెట్టి, భారీ మొత్తంలో ఆటోమెటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు.
Details
హింస మార్పును తీసుకురాదు
ప్రధాని మోదీ నాయకత్వంలో 2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. అదే సమయంలో, సాయుధ తిరుగుబాటులో పాల్గొంటున్న వారికి అమిత్ షా కీలక విజ్ఞప్తి చేశారు.
హింస మార్పును తీసుకురాదని, అభివృద్ధి, శాంతి మాత్రమే మార్గమని హితవు పలికారు. ఈ ఎన్కౌంటర్ సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన అతిపెద్ద ఆపరేషన్లలో ఒకటిగా చెప్పబడుతోంది.
ఈ ఆపరేషన్లో జిల్లా రిజర్వ్ గార్డ్స్(DRG), సీఆర్పీఎఫ్ సంయుక్త దళాలు పాల్గొన్నాయి.
మార్చి 22న అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ.. 2026 మార్చి 31 నాటికి దేశంలోని మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.