NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengal Violence: నేడు బెంగాల్ అల్లర్లపై సుప్రీంకోర్టులో విచారణ..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bengal Violence: నేడు బెంగాల్ అల్లర్లపై సుప్రీంకోర్టులో విచారణ..
    నేడు బెంగాల్ అల్లర్లపై సుప్రీంకోర్టులో విచారణ..

    Bengal Violence: నేడు బెంగాల్ అల్లర్లపై సుప్రీంకోర్టులో విచారణ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 15, 2025
    08:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.

    ఈ ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొనబడింది.

    ఈ ఘటనలను ప్రాధాన్యతగా తీసుకుని, మత, రాజకీయ హింసకు సంబంధించి లోతైన విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా కోరారు.

    రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా దిగజారినందున, ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు.

    వివరాలు 

    హింసలో బాధితులైన కుటుంబాలకు నష్టపరిహారం

    ఈ రిట్ పిటిషన్‌లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తో పాటు కేంద్ర ప్రభుత్వాన్నీ ప్రతివాదులుగా చేర్చారు.

    హింసలో బాధితులైన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని కూడా లాయర్ శశాంక్ ఝా విజ్ఞప్తి చేశారు.

    ఇటీవల రాష్ట్రంలో చట్టాన్ని అత్రిక్రమించిన విధంగా చోటుచేసుకున్న అల్లర్ల పట్ల సుప్రీంకోర్టు తక్షణంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఈ హింసాత్మక ఘటనల్లో ప్రజలపై బహుళ దాడులు జరిగి, ప్రాణనష్టంతో పాటు, ఆస్తి నష్టం, హిందువుల మతపరమైన నిర్మాణాల ధ్వంసం కూడా చోటు చేసుకున్నట్లు వివరించారు.

    వివరాలు 

    ముర్షిదాబాద్‌తో పాటు హింస ప్రభావిత ప్రాంతాల్లో ఉద్రిక్తతలు

    ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 19 (వాక్స్వాతంత్ర్యం), ఆర్టికల్ 21 (జీవించే హక్కు), ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ) హక్కులను ఈ సంఘటనలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్‌లో స్పష్టం చేశారు.

    ముర్షిదాబాద్‌తో పాటు హింస ప్రభావిత ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని న్యాయవాది శశాంక్ ఝా కోర్టును అభ్యర్థించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సుప్రీంకోర్టు

    Delhi Elections: ఢిల్లీ హింసాకాండ 2020 నిందితుడు తాహిర్ హుస్సేన్'కి కస్టడీ పెరోల్.. రోజుకు 2 లక్షల డిపాజిట్‌ భారతదేశం
    Jagdish Singh Khehar : సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ ఖేహర్‌ సేవలకు పద్మ విభూషణ్  జగదీశ్‌ సింగ్‌ ఖేహర్‌
    Supreme Court: పీజీ మెడికల్ సీట్లలో  నివాస ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏమందంటే? భారతదేశం
    Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన .. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025