NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pm Modi: ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ భేటీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pm Modi: ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ భేటీ
    ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ భేటీ

    Pm Modi: ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ భేటీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    01:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌తో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ రేంజర్లు నిర్దాక్షిణ్యంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.భారత ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ సమావేశమయ్యారు.

    ఈభేటీలో సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రతపై విస్తృతంగా చర్చలు జరిపారు.

    ఇటీవల భారత సైన్యం'ఆపరేషన్‌ సిందూర్'పేరుతో పాక్‌ ఆధారిత ఉగ్రవాద స్థావరాలపై ఆకస్మికంగా మెరుపు దాడులు చేసిన విషయం విదితమే.

    దీంతో భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.

    సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలను టార్గెట్‌ చేస్తూ పాక్‌ రేంజర్లు జరుపుతున్న కాల్పుల నేపథ్యంలో, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై మోదీ,గోవింద్‌ మోహన్‌ సమాలోచనలు జరిపారు.

    వివరాలు 

    కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాక్ 

    గత 14 రోజులుగా పాకిస్థాన్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తూ తిరిగి తిరిగి ఉల్లంఘిస్తూనే ఉన్నాయి.

    ఈ కాల్పుల కారణంగా ఇప్పటివరకు 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

    గాయపడిన వారిలో 44 మంది పూంచ్‌ సెక్టార్‌కు చెందినవారని అధికారులు వెల్లడించారు.

    మృతుల్లో ఒక జవాను కూడా ఉన్నారు. పాక్‌ షెల్లింగ్‌లో 5వ ఫీల్డ్‌ రెజిమెంట్‌కు చెందిన లాన్స్‌ నాయక్‌ దినేశ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడి వీరమరణం పొందారని వైట్‌ నైట్‌ కోర్‌ అధికారికంగా ధృవీకరించింది.

    వివరాలు 

    ఆపరేషన్ సిందూర్ 

    ఇక మంగళవారం అర్ధరాత్రి సమయంలో, పాక్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై 'ఆపరేషన్‌ సిందూర్' కింద భారత్‌ ప్రతీకార దాడులకు దిగింది.

    ఈ చర్యలో 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేసింది.

    ఈ మెరుపు దాడుల్లో 80 మంది ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యం, ఇటీవల పహల్గాం దాడికి గట్టి ప్రతీకారం తీర్చుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    PM Modi: నేడు కాశీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 44 ప్రాజెక్టులను ప్రారంభించి కాశీ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధాని.. భారతదేశం
    PM Modi: వక్ఫ్‌ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు బీజేపీ
    PM Modi: రైల్వే రంగంలో విప్లవం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరచే ప్రాజెక్ట్‌కు మోదీ శ్రీకారం! ఇండియా
    Bhagavad Gita: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025