
PM Modi: G-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి కెనడా చేరుకున్న ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా కెనడాకు చేరుకున్నారు.
అక్కడ నిర్వహించనున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు.
ఈ సదస్సుకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై మోదీ హాజరవుతున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మోదీ కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. 2015 తర్వాత మోదీ కెనడా పర్యటనకు రావడం ఇదే మొదటిసారి.
కెనడాలో కననాస్కిస్లో రెండు రోజులపాటు జరిగే జీ7 సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
ఇది ఆయనకు వరుసగా ఆరోసారి జీ7 సదస్సులో పాల్గొనడం. ఈ సదస్సులో జీ7 సభ్యదేశాల నాయకులతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రధానులతోనూ మోదీ భేటీ కానున్నారు.
వివరాలు
క్రొయేషియాకు భారత ప్రధాని
ఈ సమావేశాల్లో ఇంధన భద్రత, ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పొందుతున్న కీలక అంతర్జాతీయ అంశాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు వంటి అంశాలపై మోదీ చర్చించనున్నారు.
ముఖ్యంగా కృత్రిమ మేధ (AI) సాంకేతికత, క్వాంటమ్ సంబంధిత రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఇక పర్యటన ముగిసిన అనంతరం జూన్ 18న మోదీ తిరుగు ప్రయాణంలో భాగంగా ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు.
భారత ప్రధాని క్రొయేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.