NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..
    తదుపరి వార్తా కథనం
    Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..
    తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..

    Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 09, 2025
    08:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

    ఈ ఘటన తనను ఎంతో బాధించిందని ఆయన పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

    ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం అర్ధరాత్రి ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేసింది.

    వివరాలు 

    తిరుపతికి చంద్రబాబు

    అంతేకాక, తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఏర్పడిన తొక్కిసలాటపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

    ఆయన ఏపీ డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

    భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.

    ముందస్తు చర్యల్లో వైఫల్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    భక్తులు అధికంగా వస్తారని తెలుసుకొని తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

    మృతుల సంఖ్య పెరగకుండా, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు.

    ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను స్వయంగా పరామర్శించనున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పిఎంఓ ఇండియా చేసిన ట్వీట్ 

    Pained by the stampede in Tirupati, Andhra Pradesh. My thoughts are with those who have lost their near and dear ones. I pray that the injured recover soon. The AP Government is providing all possible assistance to those affected: PM @narendramodi

    — PMO India (@PMOIndia) January 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    తిరుపతి

    తాజా

    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి

    నరేంద్ర మోదీ

    PM Modi: ప్రధాని మోదీకి గయానా, బార్బడోస్ అత్యున్నత గౌరవం.. 19కి పెరిగిన అంతర్జాతీయ అవార్డుల సంఖ్య  భారతదేశం
    PM Modi: విదేశీ పర్యటను ముగించుకొని స్వదేశానికి బయలుదేరిన మోదీ  భారతదేశం
    PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ మహారాష్ట్ర
    PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ  భారతదేశం

    తిరుపతి

    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుమల తిరుపతి
    సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025