NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్ 
    తదుపరి వార్తా కథనం
    కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్ 
    కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్

    కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్ 

    వ్రాసిన వారు Stalin
    May 31, 2023
    06:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.

    కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీని విజయతీరాలకు చేర్చేందుకు ఇప్పటి నుంచే కసరత్తును ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

    ప్రధాని మోదీ బుధవారం రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

    దేశంలో కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు ఎక్కువగా జరిగేవని, ఆ సమయంలో యువత చీకటిలో ఉన్నారని మండిపడ్డారు.

    కాంగ్రెస్ హయాంలో ప్రధానికి మించి సూపర్ పవర్ ఇంకొకరు ఉండేవారని మోదీ విమర్శించారు. ఆనాడు ప్రభుత్వం రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసిందని దుయ్యబట్టారు.

    మోదీ

    కాంగ్రెస్‌కు హామీలు ఇవ్వడం అలవాటే: మోదీ

    2014కి ముందు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లో ఉండేవారని, పెద్ద నగరాల్లో తీవ్రవాద దాడులు జరిగేవని ప్రధాని మోదీ అన్నారు.

    బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని అన్నారు.

    కాంగ్రెస్ 'గరీబీ హఠావో'పై కూడా ప్రధాని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు హామీలు ఇవ్వడం అలవాటే అన్నారు.

    50ఏళ్ల క్రితం కాంగ్రెస్ దేశానికి 'గరీబీ హఠావో' హామీ ఇచ్చిందిని, పేదలకు ఆ పార్టీ చేసిన అతి పెద్ద ద్రోహం ఇదేననన్నారు. పేదలను మోసగించడమే దీని వ్యూహమన్నారు. దీని వల్ల రాజస్థాన్ ప్రజలు నష్టపోయారని మోదీ అన్నారు.

    కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే దేశ ప్రజలందరికీ కరోనా టీకాలు చేరుకోవడానికి మరో 40 ఏళ్లు పట్టేదని ప్రధాని మోదీ విమర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    రాజస్థాన్
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్
    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    IATA : ఖర్చులు పెరిగినా, టికెట్ ధరలు తగ్గాయి.. 10 ఏళ్లలో 40% తగ్గిన విమానయాన వ్యయం  విమానం

    నరేంద్ర మోదీ

    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు కర్ణాటక
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  ఆంధ్రప్రదేశ్
    91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్ బ్రిటన్
    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ కర్ణాటక
    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  మన్ కీ బాత్

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    అసెంబ్లీ ఎన్నికలు

    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు కర్ణాటక
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025