PM Modi: అరేబియా సముద్రంలో మునిగి.. ద్వారకలో ప్రధాని మోదీ పూజలు
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్కూబా డైవింగ్ చేశారు. ఈ సందర్భంగా సముదంలో ముగిని పోయిందని హిందూ పురాణాలు చెబుతున్న ద్వారకా నగరంలో వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సముద్రంలో మునిగి ద్వారకా నగరంలో ప్రార్థనలు చేయడం చాలా దివ్యమైన అనుభూతి అని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ విడుదల చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ద్వారకా నగరాన్ని ఒకప్పుడు శ్రీకృష్ణుడు పాలించిన ప్రదేశంగా హిందువులు నమ్ముతారు. ఈ నగరం శతాబ్దాల క్రితం సముద్రంలో మునిగిపోయింది. బీట్ ద్వారకా ద్వీపం సమీపంలోని ద్వారకా బీచ్ నుంచి స్కూబా డైవింగ్ను ద్వారా అరేబియా సముద్రంలో అడుగున పురాతన ద్వారక నగరం అవశేషాలు కనపడుతాయి.