
PM Modi: అరేబియా సముద్రంలో మునిగి.. ద్వారకలో ప్రధాని మోదీ పూజలు
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్కూబా డైవింగ్ చేశారు.
ఈ సందర్భంగా సముదంలో ముగిని పోయిందని హిందూ పురాణాలు చెబుతున్న ద్వారకా నగరంలో వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
సముద్రంలో మునిగి ద్వారకా నగరంలో ప్రార్థనలు చేయడం చాలా దివ్యమైన అనుభూతి అని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ విడుదల చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ద్వారకా నగరాన్ని ఒకప్పుడు శ్రీకృష్ణుడు పాలించిన ప్రదేశంగా హిందువులు నమ్ముతారు. ఈ నగరం శతాబ్దాల క్రితం సముద్రంలో మునిగిపోయింది.
బీట్ ద్వారకా ద్వీపం సమీపంలోని ద్వారకా బీచ్ నుంచి స్కూబా డైవింగ్ను ద్వారా అరేబియా సముద్రంలో అడుగున పురాతన ద్వారక నగరం అవశేషాలు కనపడుతాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మోదీ షేర్ చేసిన ఫొటోలు
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all. pic.twitter.com/yUO9DJnYWo
— Narendra Modi (@narendramodi) February 25, 2024